E-Paper
Advertisement

Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. ఎన్టీఆర్ మూవీ నిర్మాత మృతి.. అసలు ఎలా జరిగిందంటే?

Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. ఎన్టీఆర్ మూవీ నిర్మాత మృతి.. అసలు ఎలా జరిగిందంటే?
Advertisement

Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఒకవైపు శుభకార్యాలు.. మరొకవైపు అశుభవార్తలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతూ అభిమానులను సంతోషపరుస్తుంటే.. మరొకవైపు కొంతమంది సినీ తారలు తుదిశ్వాస విడవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించి , ప్రముఖ నిర్మాతగా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని , రోజా ఆర్ట్స్ అధినేతల్లో ఒకరైన అర్జున రాజు అనారోగ్యంతో కన్నుమూశారు.

తుది శ్వాస విడిచిన ఎన్టీఆర్ నిర్మాత..

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణం టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. సినిమా పరిశ్రమకు విశేష సేవలు అందించిన అర్జున రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నిర్మాణ సంస్థలు , సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ అటు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఆయన భౌతిక కాయాన్ని సందర్శిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఈయన అంత్యక్రియలు మార్చి 14 2026న హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో మహాప్రస్థానంలో నిర్వహించాలని కుటుంబ సభ్యులు తెలిపారు.

నిర్మాత మండలి సంతాపం..

Advertisement

ఎం. అర్జున రాజు ప్రముఖ నిర్మాణ సంస్థ రోజా ఆర్ట్స్ ద్వారా అనేక చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా నిర్మాత శివరామరాజుతో కలిసి ఆయన నటించిన కొండవీటి సింహం, ఎన్టీఆర్ వేటగాడు చిత్రాలు అప్పట్లో మంచి విజయాలను అందించాయి ముఖ్యంగా ఈ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చాయి.. రోజా ఆర్ట్స్ తో పాటు రోజా ఆర్ట్ ప్రొడక్షన్స్, రోజా ఎంటర్ప్రైజెస్ బ్యానర్లపై కూడా పలు చిత్రాలను నిర్మించి నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. సినిమా నిర్మాణంలో నిబద్ధత, ప్రొఫెషనల్ ధోరణితో పని చేసే నిర్మాతగా మంచి పేరు సొంతం చేసుకున్నారు ఇక అలాంటి ఈయన నేడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.

ALSO READ:Sayaji Shinde: తల్లి మీద ప్రేమతో నాడు అలాంటి నిర్ణయం.. నేడు భవిష్యత్తుకు ఉపయోగం!

ఆయన లేని లోటు తీర్చరానిది..

Advertisement

అర్జున రాజు మృతి పట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కోరుకుంటూ కుటుంబ సభ్యులకు భగవంతుడు తగిన మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించింది. అలాగే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కూడా ఎం.అర్జున రాజు మరణంపై విచారం వ్యక్తం చేశాయి. ఇక అర్జున రాజు నిర్మించిన చిత్రాలను గుర్తు చేసుకుంటూ ఆయనను నిబద్దతతో పనిచేసే నిర్మాతగా ప్రశంసలు కురిపించాయి. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×