Peddi Box Office: రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది. విడుదలై 13 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో సూర్య నటించిన తమిళ చిత్రం ‘కరుప్పు’ రికార్డును అధిగమించింది. దీనితో 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా ‘పెద్ది’ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
రెండో వారంలో ఈ సినిమా కలెక్షన్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది. 13వ రోజున భారతదేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం రూ. 3.45 కోట్ల నెట్ వసూళ్లను సాధించడంతో, ఇండియాలో మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 223.55 కోట్లకు (గ్రాస్ రూ. 263.78 కోట్లు) చేరాయి. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటివరకు కేవలం భారతీయ మార్కెట్ నుంచే తన పెట్టుబడిలో 64% రికవరీ సాధించడం విశేషం.
Read also-Today Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
ఇక ఓవర్సీస్ (విదేశీ) మార్కెట్లో ఈ చిత్రం రూ. 52.20 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు రూ. 315.98 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నాయి. ఇప్పటివరకు రూ. 313.81 కోట్లతో మొదటి స్థానంలో ఉన్న ‘కరుప్పు’ సినిమాను వెనక్కి నెట్టి ఈ ఏడాది టాప్ గ్రాసర్గా నిలిచింది. టాలీవుడ్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా ఉన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘దృశ్యం 3’ వంటి సినిమాలను దాటుకుంటూ ‘పెద్ది’ బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది.