E-Paper
Advertisement

Priyanka Chopra: ఆ క్షణం మర్చిపోలేనిది.. అవకాశం కొందరికే లభిస్తుంది అంటూ!

Priyanka Chopra: ఆ క్షణం మర్చిపోలేనిది.. అవకాశం కొందరికే లభిస్తుంది అంటూ!
Advertisement

Priyanka Chopra:ప్రముఖ గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత బాలీవుడ్లో సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు సంపాదించుకుంది. అలాంటి ఈమె బాలీవుడ్ లో కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడే కొన్ని సంవత్సరాలు పాటు పోరాడి ఇప్పుడు అక్కడ స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది.

వారణాసితో మరింత గుర్తింపు..

ఇకపోతే హాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు సినిమాలు చేస్తూ గ్లోబల్ ఇమేజ్ దక్కించుకున్న ప్రియాంక చోప్రా.. నేడు ఒక్కో చిత్రానికి రూ.45 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ రికార్డ్ సృష్టించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో మహేష్ బాబు(Maheshbabu ) హీరోగా వస్తున్న ‘వారణాసి’ సినిమాలో మందాకిని పాత్రలో హీరోయిన్ గా లీడ్ రోల్ పోషిస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా మైథాలజికల్ టచ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టైం ట్రావెల్ గా కూడా ఉండనుంది అంటూ గతంలో సినిమాపై ప్రియాంక చోప్రా అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా సినిమా షూటింగ్ సెట్లో తాను అనుభవించిన మధురమైన క్షణాలను అభిమానులతో పంచుకుంది.

ఆ క్షణం మరువరానిది..

Advertisement

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. “కెన్యా అడవుల్లో గడిపిన క్షణాలు మధురమైనవి. ముఖ్యంగా వేల సంఖ్యలో వైల్డ్ బీస్ట్స్ మధ్య షూటింగ్ చేయడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ప్రకృతి గొప్పతనం నాకు అప్పుడు అర్థమయింది” అంటూ ఆమె తెలిపింది. గత సెప్టెంబర్ లో జరిగిన ఈ షూటింగు తన జీవితంలో మర్చిపోలేనిదని రాజమౌళి కూడా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అలా మొత్తానికి అయితే ప్రియాంక చోప్రా సినిమాపై అంచనాలు పెంచుతూనే సినిమా గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసి ఆకట్టుకుంది. అలాగే సినిమా షూటింగ్ సెట్లో తనకు ఎన్నో మరుపురాని అనుభూతులు లభించాయని చెప్పి అభిమానులను సైతం సర్ప్రైజ్ చేసింది.

ALSO READ:HBD Sharwanand : శర్వానంద్ బర్తడే స్పెషల్.. అభిమానులకు డబుల్ ట్రీట్!

మిస్ వరల్డ్ నుండి గ్లోబల్ స్థాయికి..

Advertisement

ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. మిస్ వరల్డ్ 2000 లో విజేతగా నిలిచి కిరీటాన్ని దక్కించుకున్న ఈమె.. తన అద్భుతమైన నటనతో రెండు నేషనల్ అవార్డులు, ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. 2016లో భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్న ఈమె జాబితాలో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. అలాగే బీబీసీ 100 ఉమెన్స్ లిస్ట్ లో కూడా స్థానం సంపాదించుకుంది. జార్ఖండ్ కి చెందిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు చేస్తూనే ఇటు తెలుగు చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయింది. ఇక వారణాసి సినిమాతో తన గ్లోబల్ మార్కెట్ ను మరింత విస్తృతం చేసుకోబోతోంది ఈ ముద్దుగుమ్మ.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×