Anil Ravipudi: వెంకటేష్, అనిల్ రావిపూడిల కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద పక్కా వినోదానికి గ్యారెంటీ. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన ‘F2’, ‘F3’ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగా, ఇటీవల వచ్చిన ‘సంక్రాంతికొస్తున్నాం’ కూడా అదే జోరును కొనసాగించింది. ఇప్పుడు మరోసారి ఈ సక్సెస్ఫుల్ కాంబోలో రాబోతున్న సినిమా కోసం అనిల్ రావిపూడి ఒక క్రేజీ మల్టీస్టారర్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మెగాస్టార్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన అనిల్ తర్వాత సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, కీర్తి సురేష్ నటించబోతున్నట్లు సమాచారం. పూజా హెగ్డే టాలీవుడ్ రీ-ఎంట్రీకి ఇది ఒక గ్రాండ్ ప్లాట్ఫామ్ కానుండగా, కీర్తి సురేష్ చేరికతో సినిమాకు నటన పరంగా మరింత బలం చేకూరనుంది. వీరిద్దరూ వెంకటేష్ సరసన ఏ విధంగా మెప్పిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, వీరి ఎంపిక దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
Read also-Amardeep: మరీ ఇలా అయితే ఎలా గురూ.. ఎవరికి తెలియని నిజాలు బయటపెట్టిన అమర్దీప్ తల్లి!
మరోవైపు, ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు జోడీగా ‘నా సామిరంగ’ ఫేమ్ అషికా రంగనాథన్ ఎంపికైనట్లు సమాచారం. ఈ నలుగురు కీలక తారల మధ్య సాగే డ్రామా, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ సినిమాకు హైలైట్గా నిలవనున్నాయి. ప్రస్తుతం ఈ కాస్టింగ్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.