BigTV English
Advertisement

Vande Bharat: ఒకే రోజు 10 వందే భారత్ రైళ్లకు మోడీ పచ్చజెండా.. తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీసే ట్రైన్స్ ఇవే!

Vande Bharat: ఒకే రోజు 10 వందే భారత్ రైళ్లకు మోడీ పచ్చజెండా.. తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీసే ట్రైన్స్ ఇవే!

PM Narendra Modi: భారత రైల్వే శాఖ ఒకేసారి కొత్తగా పది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంది. భారత రైల్వే వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ వందే భారత్ రైళ్లను తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్గాల్లో ఈ రైళ్లు శరవేగంగా దూసుకెళ్లుతూ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. వీటికితోడు డిమాండ్ ఉన్న రూట్‌లలో అదనంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ నెల 16వ తేదీన ఇలాగే కొత్తగా మరో పది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి పరుగులు పెట్టించనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్తగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు సేవలు అందించనున్నాయి.


దీంతో ఆగస్టు 31వ తేదీ నుంచి రైల్వే వ్యవస్థలో వందే భారత్ ట్రైన్ల చేరిక ప్రక్రియ కొనసాగుతున్నట్టవుతుంది. గత నెల 31వ తేదీన ప్రధాని మోదీ మూడు వందే భారత్ ట్రైన్లను ప్రారంభించారు. మీరట్ నుంచి లక్నో, మదురై నుంచి బెంగళూరు, చెన్నై నుంచి నాగర్‌కోయిల్ రూట్‌లలో మూడు వందే భారత్ రైళ్లు పరుగుతీస్తున్నాయి. ఈ చేరికలకు కొనసాగింపుగానే ఈ నెల 16వ తేదీన మరో పది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

కొత్తగా ఈ రూట్‌లలో


ఈ ట్రైన్లతో సుదూర పట్టణాలకు ప్రయాణికులు సులువుగా, వేగంగా చేరుకునే వెసులుబాటు ఏర్పడుతుంది. ఇందులో నాగ్‌పూర్-సికింద్రాబాద్ (578 కిలోమీటర్లు) రూట్ ఉన్నది. ఈ రూట్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. పూణె-హుబ్బలి రూట్‌లోనూ వందే భారత్ పరుగులు పెట్టనుంది.

Also Read: Sitaram Yechury: ఏచూరి వామపక్ష నేత అయినా ‘మేమిద్దరం స్నేహంగానే ఉండేవాళ్లం’: వెంకయ్యనాయుడు

వీటితోపాటు విశాఖపట్నం నుంచి దుర్గ్, తాతానగర్ నుంచి బెర్హంపూర్, రూర్కెలా నుంచి హౌరా, హౌరా నుంచి గయా, ఆగ్రా నుంచి వారణాసి, తాతా నగర్ నుంచి పాట్నా, వారణాసి నుంచి దియోగర్, రాంచి నుంచి గొడ్డా రూట్‌లలో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులోకి రానున్నాయి.

సెంట్రల్ రైల్వే పరిధిలో ఆరు వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. సీఎస్ఎంటీ – షిర్డీ, సీఎస్ఎంటీ – షోలాపూర్, నాగ్‌పూర్ – ఇందోర్ రూట్‌లలో వందే భారత్‌లు సేవలు అందిస్తున్నాయి. కొత్త వందే భారత్ ట్రైన్‌లతో మహారాష్ట్రలో మొత్తం ఎనిమిది వందే భారత్ ట్రైన్లు సేవలు అందిస్తాయి.

Also Read: Sitaram Yechury: ఇందిరా గాంధీతో రాజీనామా చేయించిన సీతారాం ఏచూరి.. మరిన్ని ఆసక్తికర విషయాలివే!

దుర్గ్ – విశాఖపట్నం రూట్‌లో నడిచే వందే భారత్ షెడ్యూల్ ఇలా ఉన్నది. విశాఖపట్నం నుంచి 20829 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 05.45 గంటలకు బయల్దేరుతుంది. అది రాయ్‌పూర్, మహాసమంద్, ఖరియర్ రోడ్, కంటాబంజీ, తితలాగడ్, కేసింగ, రాయగడ, విజయనగరం మీదుగా.. మధ్యహ్నం 1.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఇక విశాఖపట్నం నుంచి 20830 వందే భారత్ ట్రైన్ మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరుతుంది. పైన పేర్కొన్న స్టేషన్ల మీదుగా రాత్రి 10.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×