E-Paper
Advertisement

Nepal Landslide: కొండచరియలు విరిగిపడి.. 14 మంది మృతి

Nepal Landslide: కొండచరియలు విరిగిపడి.. 14 మంది మృతి
Advertisement

Nepal Landslide: తూర్పు నేపాల్ లోని కోషి ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి కనీసం 14 మంది మృతి చెందారు. ఇల్లమ్ జిల్లాలోని సూర్యోదయ మునిసిపాలిటీతో సహా పలు ప్రాంతాల్లో ఈ మరణాలు సంభవించాయి.

సహాయక చర్యలు అంతరాయం

Advertisement

నేపాల్ ప్రభుత్వం తక్షణమే హెలికాప్టర్ దళాలు, సైనిక బృందాలు సహాయక చర్యల కోసం పంపింది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా.. హెలికాప్టర్‌లు బాధిత ప్రాంతాలపై దిగలేకపోయాయి. రోడ్లు కొట్టుకుపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం కారణంగా రక్షణ చర్యలు మందగించాయి.

స్థానిక రెస్క్యూ టీములు, స్వచ్ఛంద సేవకులు రాత్రంతా ప్రయత్నాలు కొనసాగించారు. భారీ మట్టి, చెట్లు, రాళ్ల మధ్య మృతదేహాలను బయటకు తీసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.

Advertisement

బాధిత కుటుంబాల ఆర్తనాదం

సూర్యోదయ మునిసిపాలిటీలోని బందర్‌బసా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించారు.

ప్రభుత్వ చర్యలు

నేపాల్ హోం మంత్రిత్వ శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రధాన మంత్రి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల సహాయం అందిస్తుందని ప్రకటించారు.

ప్రమాద ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను.. సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అలాగే వర్షాలు మరింత కొనసాగవచ్చని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

వాతావరణం ఇంకా ఆందోళనకరం

నేపాల్ వాతావరణ శాఖ ప్రకారం, మాన్సూన్‌ ప్రభావం ఇంకా రెండు రోజులు కొనసాగుతుంది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Also Read: దుర్గా దేవి నిమజ్జనోత్సవంలో టీడీపీ, వైసీపీ ఘర్షణ..

భారత సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత

నేపాల్‌ తూర్పు ప్రాంతాలకు సమీపంగా ఉన్న బీహార్‌, సిక్కిం సరిహద్దు ప్రాంతాల్లో భారత అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు గ్రామాల్లో నదుల నీటిమట్టం పెరగడంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

 

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×