E-Paper
Advertisement

Chhattisgarh: నెత్తురోడుతున్న దండకారణ్యం.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి..

Chhattisgarh: నెత్తురోడుతున్న దండకారణ్యం.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి..
Advertisement

Encounter in ChhattisgarhEncounter in Chhattisgarh: దండకారణ్యం నెత్తురోడుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో పోలీసులకు, మావోయిస్టులకు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పుల జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోగా పలువురు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

సోమవారం 8 లక్షల రివార్డు కలిగిన మావోయిస్టు లొంగిపోయాడు. అ తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం. కాగా ఇటీవలె సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. దీంట్లో ఇక మావోయిస్టు మృతిచెందాడు.

Read More: Lokpal: లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్..

Advertisement

అటు ఆదివారం కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ బలగాలకు మావోల మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. దీంతో దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లుతోంది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×