E-Paper
Advertisement

Chhattisgarh: నెత్తురోడుతున్న దండకారణ్యం.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి..

Chhattisgarh: నెత్తురోడుతున్న దండకారణ్యం.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి..

Encounter in ChhattisgarhEncounter in Chhattisgarh: దండకారణ్యం నెత్తురోడుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో పోలీసులకు, మావోయిస్టులకు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పుల జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోగా పలువురు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సోమవారం 8 లక్షల రివార్డు కలిగిన మావోయిస్టు లొంగిపోయాడు. అ తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం. కాగా ఇటీవలె సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. దీంట్లో ఇక మావోయిస్టు మృతిచెందాడు.

Read More: Lokpal: లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్..

అటు ఆదివారం కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ బలగాలకు మావోల మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. దీంతో దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లుతోంది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×