![A M Khanwilkar appointed as Lokpal chairperson](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/02/Lokpal-1280-x-720.jpg)
Ex-SC judge Justice A M Khanwilkar appointed Lokpal chairperson: లోక్పాల్ ఛైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్ మంగళవారం నియమితులయ్యారు. కాగా జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్ జూలై 2022లో సుప్రీంకోర్టు నుండి పదవీ విరమణ చేశాడు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్పాల్ ఛైర్పర్సన్గా జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్ను నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.. అని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
రాష్ట్రపతి భవన్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రీతు రాజ్ అవస్తీలను న్యాయశాఖ సభ్యులుగా నియమించారు. జ్యుడీషియల్ సభ్యులు కాకుండా ఇతర సభ్యులలో సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టిర్కీ ఉన్నారు.
సుశీల్ చంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ కాగా, అవస్తీ ప్రస్తుతం లా కమిషన్ ఛైర్పర్సన్గా ఉన్నారు.
Read More: హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ట్విస్ట్.. లక్కీ డ్రా ద్వారా అభ్యర్ధి ఎన్నిక..
లోక్పాల్లో న్యాయవ్యవస్థ సభ్యుడు జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి ప్రస్తుతం తాత్కాలిక ఛైర్పర్సన్గా ఉన్నారు.
ప్రధాని నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిఫార్సులను స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి లోక్పాల్ అధ్యక్షుడిని, సభ్యులను నియమిస్తారు.