E-Paper
Advertisement

Mumbai City: అమాంతంగా ఒరిగిన అపార్టుమెంట్.. బెంబేలెత్తిన కుటుంబాలు, ఆ తర్వాత ఏం జరిగింది?

Mumbai City: అమాంతంగా ఒరిగిన అపార్టుమెంట్.. బెంబేలెత్తిన కుటుంబాలు, ఆ తర్వాత ఏం జరిగింది?
Advertisement

Mumbai City: వర్షాకాలం వచ్చిందంటే కొన్నిప్రాంతాల అపార్టుమెంట్ వాసులు బెంబేలెత్తుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, దీనికితోడు భవనాలను రీమోడల్ చేస్తుండడంతో ఎలాంటి సమస్య వచ్చి పడుతుందేనని భయంతో వణికిపోతున్నారు. తాజాగా ముంబైలోని నాలుగు అంతస్తుల అపార్టుమెంట్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది.

తూర్పు ముంబైలోని అల్కాపురి ప్రాంతంలో సాయిరాజ్ అపార్ట్‌మెంట్ నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా ఒరిగిపోయింది. ఉన్నట్లు భవనం ఒరిగిపోవడాన్ని గమనించారు ఇరుగుపొరుగువారు. వెంటనే అపార్టుమెంటులోని ఉన్నవారికి సమాచారం ఇచ్చారు. వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు. భవనం ఒంగిన విషయాన్ని పైస్థాయి అధికారులకు తెలిపారు.

Advertisement

రంగంలోకి అగ్నిమాపక దళం, VVCMC అధికారులు దిగారు. నివాసితులను వెంటనే అపార్టుమెంట్ నుంచి ఖాళీ చేయించి సమీపంలోని హాలుకు తరలించారు. దాదాపు 70 కుటుంబాలు ఆ అపార్టుమెంటులో ఉన్నట్లు తెలుస్తోంది. రెండువారాల కిందట గ్రౌండ్ ఫ్లోర్ షాపుల కోసం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అపార్టుమెంట్ ఒరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

అయితే VVCMC అధికారులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. ఈ భవన నిర్మాణాన్ని ఇంజనీర్లు తనిఖీ చేసిన తర్వాత ఓ అంచనాకు రానున్నారు. స్థిరంగా ఉంటుందా? ఎప్పుడైనా కూలిపోతుందా? తెలియనుంది. ఇదేకాదు ముంబై సిటీలోని చాలా ప్రాంతాల్లో పాత అపార్టుమెంట్లు ఉన్నాయి. వాటిపై అప్పుడు అనుమానాలు మొదలయ్యాయి.

Advertisement

ALSO READ: సోమవారం అధికారిక సెలవు ఉందా? బ్యాంకులు ఓపెన్ ఉంటాయా?

అన్నట్లు ఆ మధ్య హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో ఇలాగే జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అందులోని కుటుంబాలను ఖాళీ చేయించారు. ఆ తర్వాత హైడ్రాలిక్ యంత్రాల సాయంతో ఆ భవనాన్ని కూల్చివేసిన విషయం తెల్సిందే. నిర్మాణం సమయంలో సెట్ బ్యాక్ వదలకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని అన్నారు. అయితే ఆ భవనం పక్కన సెల్లార్ కోసం తవ్వకాలు జరపడం వల్లే ఒరిగినట్టు నిర్థారణకు వచ్చారు. ఏదేమైనా హైదరాబాద్, ముంబై నగరాల్లో భవనాలు పక్కకు ఒరిగిపోవడంతో కాస్త భయంగా ఉంది.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×