E-Paper
Advertisement

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో డీఏ పెంపు!

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో డీఏ పెంపు!
Advertisement

DA Hike for Central Government Employees: డీఏ పెంపు, అరియర్స్‌పై ప్రకటన కోసం ఎదురుచూస్తున్న వారికి ఓ బిగ్ అప్డేట్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కేంద్రం నుంచి రెండు పెద్ద బహుమతులు లభించే అవకాశం ఉంది – ఒకటి కరువు భత్యం (Dearness Allowance)పెంపు, మరొకటి 18 నెలల బకాయిలను విడుదల చేయడం. దీని వలన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరగే అవకాశం ఉంది.

త్వరలో 18 నెలల బకాయిలు:

Advertisement

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, కోవిడ్ మహమ్మారి సమయంలో 18 నెలల పాటు నిలిపివేసిన కరువు భత్యం (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు బకాయిలను పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు.

గతంలో నిలిపివేసిన 18 నెలల డీఏ బకాయిలను విడుదల చేయాలని భారతీయ ప్రతిక్ష మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి ముఖేష్ సింగ్ లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

కోవిడ్ వ్యాప్తి కారణంగా, కేంద్ర ప్రభుత్వం జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు 18 నెలల పాటు డీఏ, డీఆర్ చెల్లింపులను నిలిపివేసింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా డీఏ, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఆర్ 42 శాతం నుంచి 46 శాతానికి పెంచారు. జూలై 1, 2023 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది.

డీఏ పెంపు ఎంత..?

ఈసారి కేంద్ర ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డీఏ) 4 శాతం పెరిగే అవకాశం ఉందని, దీనిని మార్చిలో ఆమోదించి ఏప్రిల్లో చెల్లించే అవకాశం ఉందన్నారు. కొత్త డీఏ రేటు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

మార్చిలో డీఏ పెంపు ప్రకటన తర్వాత 2024 ఏప్రిల్ వేతనంలో చెల్లిస్తారు. హోలీకి ముందే ఉద్యోగులకు కరువు భత్యం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీన్ని పెంచితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలల డబ్బు ఏకమొత్తంలో లభిస్తుంది.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×