E-Paper
Advertisement

పొలంలో గొయ్యి తవ్వి రూ.5 లక్షలు దాచిపెట్టిన రైతు.. ఏడాది తర్వాత చూస్తే, అయ్యో పాపం!

పొలంలో గొయ్యి తవ్వి రూ.5 లక్షలు దాచిపెట్టిన రైతు.. ఏడాది తర్వాత చూస్తే, అయ్యో పాపం!
Advertisement

Farmer: అతి భద్రత కూడా కొన్నిసార్లు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. పైన కనిపించిన రైతు విషయంలో అదే జరిగింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా డబ్బులు దాచే ప్రయత్నం చేశాడు. చివరకు ఆ డబ్బంతా మట్టిపాలు అయ్యింది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. అసలు ఏం జరిగింది?

రాజస్థాన్‌కి చెందిన ఓ రైతు అతి భద్రత

రాజస్థాన్‌లో ఓ రైతుకు ఊహించని ఘటన ఎదురైంది. పచ్‌పాద్రాకు చెందిన రైతు మంగీలాల్ మేఘ్వాల్.. ఏడాది కిందట తనకున్న కొంత భూమిని విక్రయించాడు. అందుకు ఆయన చేతికి రూ.5 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో కొత్తగా ఇంటిని నిర్మించుకోవాలని ఆలోచన చేశాడు. ఐదు లక్షలు ఇంట్లో పెడితే ఎవరైనా చోరీ చేసే అవకాశముందని భయపడ్డాడు. ఆ డబ్బు ఏం చెయ్యాలో తెలియక కొద్దిరోజులు సతమతమయ్యాడు. డబ్బును చూసి ఇంట్లో వాళ్లు వృథా ఖర్చులు చేయడం ఖాయమని భావించాడు. అలా చేస్తే డబ్బు తరిగిపోవడం ఖాయమని అనుకున్నాడు.

Advertisement

 

స్థలం అమ్మిన నగదు భూమిలో పాతిపెట్టాడు

దీంతో డబ్బును ఎలా జాగ్రత్త చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. వచ్చిన డబ్బును తనకున్న భూమిలో పాతిపెడితే బాగుంటుందని అనుకున్నాడు. ఆలోచన రాగానే దాన్ని అమలు చేశాడు. కుటుంబసభ్యులకు తెలియకుండా రాత్రి వేళ పొలానికి వెళ్లాడు. అక్కడ పాలిథీన్ కవర్‌లో చుట్టిన రూ.5 లక్షలు పొలంలో పాతి పెట్టాడు. ఇక అక్కడితో ఆ రైతుకు డబ్బు టెన్షన్ తగ్గింది. కొంతకాలానికి డబ్బు అవసరం పడడంతో పాతిపెట్టిన చోటు మర్చిపోయాడు రైతు. ఎంత ఆలోచించినా ఆ ప్రాంతం గుర్తుకు రాలేదు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పాడు. వారంతా వెతికినా పొలంలో ఎక్కడా డబ్బుల జాడ కనిపించలేదు.

Advertisement

 

మతిమరుపుతో ఆ ప్రాంతాన్ని మరిచిపోయాడు, ఏం జరిగింది?

గడిచిన నెల రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వ్యవసాయానికి సిద్ధమైన సదరు రైతు, ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా డబ్బులున్న బ్యాగు ఠక్కున బయటపడింది. నోట్ల కట్టలు బయటపడ్డాయికానీ, వాటికి చెదలు పట్టేశాయి. వాటిని చూసి నిరాశకు లోనయ్యాడు. చివరిగా ఈ నోట్లను బ్యాంకులో ఇచ్చి కొత్తవి తెచ్చుకోవాలని అనుకున్నాడు. నోట్లు బాగా పాడైపోవడంతో వివిధ బ్యాంకులు తిరస్కరించాయి. జైపూర్‌లోని పెద్ద బ్యాంకులను సంప్రదించాలని సలహా ఇచ్చాయి. డబ్బులో కొంతైనా తిరిగొస్తే బాగుండని రైతు ఆశిస్తున్నాడు. అతి భద్రతకు వెళ్లి మొత్తం నాశనం అయ్యిందని తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

 

ALSO READ: వింత బాలుడు.. ఐదేళ్లుగా చెరువు నీటిలో జీవనం, చూసేందుకు ఎగబడుతున్న జనం

 

 

Related News

వింత బాలుడు.. ఐదేళ్లుగా చెరువు నీటిలో జీవనం.. చూసేందుకు ఎగబడుతున్న జనం!

స్టార్ హోటల్‌లో దారుణం.. ఇద్దరు కూతుళ్లను చంపి, ఆ తర్వాత తండ్రి కూడా..

రణరంగంగా మారిన రాంచీ.. విద్యార్థుల ‘ఛలో అసెంబ్లీ’ ఉద్రిక్తం.. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం!

‘మోడియా బింద్’ గ్లాసెస్‌తో ఎంపీ రేణుకా చౌదరి నిరసన.. వీడియో వైరల్!

మధ్యప్రదేశ్‌లో విషాదం.. కాలువలో కొట్టుకుపోయిన వ్యాన్.. 9 మంది మృతి!

మా పోరాటం ఆగదు.. మౌనం కాదు-హింసను ఆమోదించడమే- రాహుల్‌గాంధీ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గురూ.. ఎఎఐలో 389 జాబ్స్.. వెంటనే అప్లై చేసేయండి

Big Stories

Advertisement
×