E-Paper
Advertisement

Odisha: ఒడిశాలో దారుణం.. యువకుడు ప్రేమ పెళ్లి, 40 మందికి శిరోముండనం

Odisha: ఒడిశాలో దారుణం.. యువకుడు ప్రేమ పెళ్లి, 40 మందికి శిరోముండనం
Advertisement

Odisha: తమ గ్రామానికి చెందిన యువకుడు మరొక కులానికి చెందిన యువతిని వివాహం చేసుకోవడం ఆ గ్రామ పెద్దలకు నచ్చలేదు. గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘించారంటూ యువతి కుటుంబసభ్యులపై రుసరుసలాడారు. వారిని ఊరి నుంచి వెలి వేయకుండా ఊహించని విధంగా శిక్ష విధించారు. ఈ ఘటన ఒడిషాలో వెలుగు చూసింది.

ఒడిశాలోని రాయగడ జిల్లా కాశీపూర్‌ సమితి అమానుష ఘటనకు వేదికైంది. యువతి కుటుంబసభ్యులను ఊరి వెలి శిక్ష నుంచి తప్పించుకునేందుకు కుటుంబంలోని దాదాపు 40 మంది పురుషులు శిరోముండనం చేశారు ఆ గ్రామ పెద్దలు. స్థానిక గోరఖ్‌పూర్‌ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, షెడ్యూల్డ్‌ కులానికి చెందిన యువకుడు ప్రేమించింది.

Advertisement

చివరకు వీరిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే యువతి తరపు వారు ఈ పెళ్లి ససేమిరా అన్నారు. ఈ క్రమంలో ప్రేమికులు మూడు రోజుల కిందట వివాహం చేసుకున్నారు. ఆ జంట రెండురోజుల కిందట గ్రామానికి వచ్చింది. ప్రేమ జంట తమ ఊరికి వచ్చిన విషయం గ్రామ పెద్దలకు తెలిసింది.

ఆ గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి కుటుంబ సభ్యులను వెలివేశారు. ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయం ఆలోచించారు. వెలికి బదులుగా శిరోముండనం చేయించుకోవాలని నిర్ణయించారు.  అందుకు యువతి కుటుంబసభ్యులు ఓకే చెప్పారు. ఎందుకంటే యువతికి పెళ్లికి వారి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అలాగే మూగ జీవాలను బలిచ్చి నూతన జంటకు పెద్ద కర్మ చేయాలని డిసైడ్ అయ్యారు.

Advertisement

ALSO READ: 1206.. చివరకు చావు కూడా లక్కీ నెంబర్‌తోనే

చేసేదేమీ లేక యువతి కుటుంబసభ్యులు, బంధువులు దాదాపు 40 మంది పురుషులు శిరోముండనం చేయించుకున్నారు.  గ్రామ కట్టుబాట్లు ప్రకారం మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చి పూజలు చేశారు. ఈ వ్యవహారం మీడియా దృష్టికి వచ్చింది. దీనిపై పోలీసులను మీడియా ప్రతినిధులు అడిగారు. తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.

అసలే అమ్మాయిలు దొరక్క రోజు రోజుకూ పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సమయంలో గ్రామ పెద్దలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో చాలామంది మండిపడుతున్నారు. జీవితాంతం కలిసి ఉండేది వాళ్లేనని, మీ జోక్యం ఏంటని ప్రశ్నించినవాళ్లు లేకపోలేదు. గ్రామ పెద్దల తీర్మానానికి ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. తీర్మానం మేరకు శిరోముండనం చేయించుకున్నారు.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×