E-Paper
Advertisement

Minister Atishi Claims: బీజేపీ బంపరాఫర్.. ఓకే కాకుంటే మేం జైలుకే..!

Minister Atishi Claims: బీజేపీ బంపరాఫర్.. ఓకే కాకుంటే మేం జైలుకే..!
AAP Minister Atishi Claims BJP Switch Offer,These AAP Leaders To Be Arrested Soon

Minister Atishi Claims: ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు మొదలయ్యేనాటికి మరో నాలుగురు ఆప్ నేతలు అరెస్ట్ కావచ్చని ఆరోపించారు. అందులో తాను కూడా ఉంటానని తెలిపారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, తనతోపాటు మంత్రి సౌరబ్ భరద్వాజ్, మరోనేత దుర్గేశ్ పాథక్, ఎంపీ రాఘవ్ చద్దా ఆ లైన్‌లో ఉండే అవకాశముందని తెలిపారు.

సీఎం కేజ్రీవాల్ కస్టడీ సందర్భంగా న్యాయస్థానంలో వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తన పేరు ఈడీ ప్రస్తావించినట్టు మంత్రి ఆతిశీ తెలిపారు. ఈ కేసులో నిందితుడు విజయ్‌నాయర్.. మంత్రి వర్గంలోకి ఆతిశీ, సౌరబ్‌కు రిపోర్టు చేసేవాడనని ముఖ్యమంత్రి అన్నట్లుగా కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆతిశీ వ్యాఖ్యలు చేశారు. ఈ స్టేట్‌మెంట్ సీబీఐ, ఈడీ వద్ద ఎప్పటినుంచో ఉందని, దాన్ని ఇప్పుడు బయట పెట్టడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్‌సింగ్, సత్యేంద్రజైన్ అరెస్ట్ తర్వాత ఆప్ ఐక్యంగా ఉందని బీజేపీ భావించడమే దీనికి కారణమన్నారు.

వరుసలో ఉన్న తమని జైలుకి పంపించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని దుయ్యబట్టారు మంత్రి ఆతిశీ. తన పొలిటికల్ కెరీర్‌ని కాపాడుకోవాలంటే బీజేపీలో చేరేలా ఓ వ్యక్తి ద్వారా సంప్రదింపులు జరిపినట్టు చెప్పుకొచ్చారు. జాయిన్ కాకపోతే ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆ వ్యక్తి ద్వారా చెప్పించారని గుర్తు చేశారు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా అన్న ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.

ALSO READ : లెక్కల్లో మాంచి దిట్ట.. కారు, ఇల్లు లేని యువరాజు

దీనికి సంబంధించి రెండు ప్రొవిజన్స్ ఉన్నాయని, రెండేళ్లకు పైగా శిక్ష పడితే ప్రజాప్రతినిధిగా ఉండేందుకు వీలుండదన్నారు. కేజ్రీవాల్ ఇంకా దోషిగా తేలలేదన్నారు. మరోవైపు ఈ మద్యం కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం సీఎం కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ని తీహార్ జైలుకు తరలించారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×