E-Paper
Advertisement

Arvind Kejriwal : ‘కేజ్రీవాల్‌కు బెయిల్ వస్తుందని తెలిసే సిబిఐ అరెస్టు చేసింది.. అంతా రాజకీయం’

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయినా కేజ్రీవాల్ జైలు నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఇదంతా రాజకాయ కారణాలతోనే జరుగుతోంది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సుప్రీం కోర్టు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ మీడియా ముందు ఘాటు వ్యాఖ్యాలు చేశారు.

Arvind Kejriwal : ‘కేజ్రీవాల్‌కు బెయిల్ వస్తుందని తెలిసే సిబిఐ అరెస్టు చేసింది.. అంతా రాజకీయం’
Advertisement

Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయినా కేజ్రీవాల్ జైలు నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఇదంతా రాజకాయ కారణాలతోనే జరుగుతోంది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సుప్రీం కోర్టు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ మీడియా ముందు ఘాటు వ్యాఖ్యాలు చేశారు.

ఢిల్లీ మధ్యం పాలసీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన కేబినెట్ మంత్రులు అవినీతి పార్పడ్డారని ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్టు చేసింది. కేజ్రీవాల్ తన అరెస్టు చట్ట వ్యతిరేకమని ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. దాదాపు మూడు నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు. జూలై 12న సుప్రీం కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ బెయిల్ తీర్పు వెలువడే కొద్ది రోజుల ముందు సిబిఐ అధికారులు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీ నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. అంటే జైలులో ఉన్న వ్యక్తి మళ్లీ అరెస్టు చేయడం.

Advertisement

Also Read| రైతులను తుపాకీతో బెదిరిస్తూ ట్రైనీ ఐఏఎస్ అధికారి తల్లి హల్‌చల్‌

ఇప్పుడు ఈడీ.. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వేసిన కేసులో ఆయనకు బెయిల్ లభించినా.. సిబిఐ కేజ్రీవాల్ ను విడిచిపెట్టదు. దీనిపై మీడియాకు కేజ్రీవాల్ లాయర్ అభిషేక్ సింఘ్వీ వివరణ ఇస్తూ.. ఇది ఒక రాజకీయ కుట్ర అని స్పష్టంగా కనబడతోందని ఘూటుగా విమర్శించారు.

Advertisement

“సిబిఐ, ఈడీ ఈ రెండు విచారణ ఏజెన్సీలు ఒక నేరారోపణపై కేజ్రీవాల్ ను విచారణ చేస్తున్నారు. మరి ఆ ఆరోపణలపై సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చినా.. సిబిఐ ప్రత్యేకంగా కేజ్రీవాల్ ను కస్టడీలో ఉంచడం.. ఎలా కరెక్ట్. కేజ్రీవాల్‌ను బయటికి రాకుండా చేయాలనే ముందుగా సిబిఐ కస్టడీలోకి తీసుకుంది. 2023లో సిబిఐ అధికారులు కేజ్రీవాల్‌ను ఈ కేసులో విచారణ చేశారు. మళ్లీ 2024 మార్చిలో ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఆయన కస్టడీలో ఉండగా మళ్లీ అరెస్టు చేయడమేంటి?.. ఒక నేరారోపణలో సిబిఐ, ఈడీ విచారణ చేయడం చాలా కేసుల్లో చూశాం.. కానీ ఇలా కస్టడీలో ఉండగా.. మళ్లీ అరెస్టు చేయడాన్ని ముందస్తు అరెస్ట్ అంటే ఇన్సూరెన్స్ అరెస్ట్ అని అంటారు. దీనికి వెనుక రాజకీయమే ఉంది. మరే కారణం లేదు.” అని అభిషేక్ సింఘ్వీ అన్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×