E-Paper
Advertisement

Abhishek Manu Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ

Abhishek Manu Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ
Advertisement

Rajya Sabha: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు తమ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. తెలంగాణలో కే కేశవరావు తన రాజ్యసభ స్థానానికి ఈమధ్యే రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మొత్తం రాజ్యసభలోని 12 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ సిద్ధమైంది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లోని ఈ ఖాళీలను పూర్తి చేయడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనుంది.

తెలంగాణలో పార్టీ మారిన కేకే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయగా, మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పలువురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో పలు రాష్ట్రాల్లోని స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈక్రమంలోనే తెలంగాణ స్థానానికి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.

Advertisement

Also Read: Independence Day: ఒకే సారి స్వాతంత్ర్యం పొందినా, భారత్ కంటే పాక్ ఒక రోజు ముందే వేడుకలు చేసుకుంటుంది.. ఎందుకు?

27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఎన్నిక అవసరమైతే సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని బుధవారం అధికారికంగా ప్రకటించింది.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×