BigTV English

Ahmedabad: వివాహేతర సంబంధం.. భార్యకు విడాకులిస్తే భరణం, కోర్టు సంచలన తీర్పు

Ahmedabad: వివాహేతర సంబంధం.. భార్యకు విడాకులిస్తే భరణం,  కోర్టు సంచలన తీర్పు

Ahmedabad: తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకులు కావాలని కోరుతూ కోర్టుకి ఎక్కాడు ఓ ఎన్నారై. విడాకులు మంజూరు చేసిన న్యాయస్థానం, ఎన్నారై భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. భార్యకు భరణం చెల్లించాలని తీర్పు చెప్పింది. న్యాయస్థానం తీర్పుతో షాకయ్యాడు ఆ ఎన్నారై. అసలేం జరిగింది?


అహ్మదాబాద్‌లోని సబర్మతి ప్రాంతానికి చెందిన వ్యక్తి, గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళను మ్యారేజ్ చేసుకున్నాడు. వీరి వివాహం 2006లో జరిగింది. గుజరాత్ నుంచి తర్వాత ఆ దంపతులు అబుదాబి వెళ్లారు. అక్కడే కాపురం పెట్టారు. పెళ్లయిన ఆరేళ్లకు వారికి కొడుకు పుట్టాడు.

మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. భార్యను వేధించడం మొదలుపెట్టాడు ఆ భర్త. రోజురోజుకూ ఇంట్లో గొడవలు ముదిరిపాకాన పడ్డాయి. భర్తతో ఉండలేక నాలుగేళ్ల తర్వాత అంటే 2016లో ఇండియాకు తిరిగి వచ్చేసింది ఆ మహిళ. మరుసటి ఏడాది 2017లో సబర్మతి పోలీసులకు గృహ హింస, మహిళల రక్షణ చట్టం కింద ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్తపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.


ఈ క్రమంలో ఎన్నారై భర్త విడాకుల కోసం అహ్మదాబాద్ కోర్టును ఆశ్రయించాడు. భార్య కూడా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనకు భరణం కావాలని ప్రస్తావించింది. 2023 జనవరి 20న విడాకులు మంజూరు చేసింది న్యాయస్థానం. అంతకుముందు ఆమెకు, వారి కుమారుడికి కలిపి నెలకు రూ. 40 వేలు కింద భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

ALSO READ: నేలను బలంగా ఢీ కొట్టిన హెలికాఫ్టర్, కేదార్‌నాథ్‌లో వైద్య టీమ్ సేఫ్

అంతేకాదు ఇంటి అద్దె కింద మరో రూ.20 వేలు చెల్లించాలని తీర్పులో ఆదేశించింది. చివరకు పరిహారం కింద రూ.25 లక్షలు కూడా చెల్లించాలని ఆదేశించింది. బాధిత మహిళ గృహ హింసకు గురైందని న్యాయస్థానం గుర్తించింది. కోర్టు తీర్పుపై ఆ ఎన్నారై భర్త జడ్జి ముందు తన గోడు వెల్లబోసుకున్నాడు.

తాను ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నానని భరణం ఇవ్వలేనని ప్రస్తావించాడు ఆ ఎన్నారై. ఆ వ్యక్తి వాదనను చివరకు న్యాయస్థానం నమ్మలేదు. అబుదాబిలో రెండో భార్యతో జీవిస్తున్న ఆ వ్యక్తి, భరణం తప్పించుకునేందుకే నిరుద్యోగినని అబద్దం చెప్పాడని తేల్చేసింది. చివరకు భార్యకు భరణం చెల్లించాల్సిందేనని తీర్పులో వెల్లడించింది న్యాయస్థానం.

Tags

Related News

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Big Stories

×