E-Paper
Advertisement

కేరళం కొత్త సీఎం ఎంపికపై ఏఐసీసీ కసరత్తు.. ఎమ్మెల్యేల ఓపీనియన్ తీసుకుంటున్న పరిశీలకులు, ఆయన వైపే

కేరళం కొత్త సీఎం ఎంపికపై ఏఐసీసీ కసరత్తు.. ఎమ్మెల్యేల ఓపీనియన్ తీసుకుంటున్న పరిశీలకులు, ఆయన వైపే

Keralam Politics: కేరళం కొత్త సీఎం ఎవరు? ముఖ్యమంత్రి పీఠం కోసం ముగ్గురు సీనియర్ నేతలు రేసులో ఉన్నారా? పీఠం ఎవరి సొంతం కానుంది? ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఏఐసీసీ పరిశీలకులు తీసుకున్నారా? మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారా?  అవుననే అంటున్నాయి కేరళం కాంగ్రెస్ వర్గాలు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు?

కేరళం కొత్త సీఎం ఎంపికపై ఏఐసీసీ కసరత్తు

కేరళం కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై కసరత్తు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇద్దరు సభ్యుల బృందాన్ని తిరువనంతపురం పంపించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్. ఒక్కో ఎమ్మెల్యేలతో సమావేశమై వారి నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నారు.

కొత్త సీఎల్పీ లీడర్ ఎవరైతే బాగుంటుంది? పరిశీలకులతో సమావేశం తర్వాత కేరళం కాంగ్రెస్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు సీఎం రేసులో ఉన్న ఎమ్మెల్యే వీడీ సతీషన్. ఎమ్మెల్యేల నుంచి సేకరించిన అభిప్రాయాల నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి పంపనుంది ఏఐసీసీ బృందం.

ఎమ్మెల్యేల ఓపీనియన్ తీసుకుంటున్న పరిశీలకులు

తాజాగా అందుతున్న సమాచారం మేరకు కేసీ వేణుగోపాల్‌ వైపు 47మంది ఎమ్మెల్యేలు మొగ్గు చూపినట్టు వార్తలు వస్తున్నాయి. సతీషన్‌కు వైపు ఏడుగురు, రమేష్ చెన్నితాల వైపు ఏడుగురు మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. కొత్త సీఎం ఎవరన్న దానిపై ఆదివారం కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రేసులో ముగ్గురు నేతలు కేసీ వేణుగోపాల్, వీడీ సతీషన్, రమేష్ చెన్నితాల కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు. వీరిలో కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. యూపీఏ హయాంలో రమేష్ చెన్నితాల ఓ వెలుగు వెలిగాయి.  ఇక వీడీ సతీషన్ మాత్రం కేరళాకు పరిమితమయ్యారు.  కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది తెలియాలంటే ఆదివారం వరకు నేతలు వెయిట్ చేయాల్సిందే.

ALSO READ: తమిళనాడులో సేమ్ సీన్.. విజయ్ ప్రభుత్వంపై గవర్నర్ ఆఫీసు క్లారిటీ, మళ్లీ మొదటికి

 

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×