BigTV English

Amit Shah Tamil Nadu : అవినీతిని కప్పిపుచ్చడానికే హిందీ వివాదం.. స్టాలిన్ ప్రభుత్వంపై అమిత్ షా సీరియస్

Amit Shah Tamil Nadu : అవినీతిని కప్పిపుచ్చడానికే హిందీ వివాదం.. స్టాలిన్ ప్రభుత్వంపై అమిత్ షా సీరియస్

Amit Shah Tamil Nadu | తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి వైద్య, ఇంజనీరింగ్ కోర్సులను తమిళంలోకి అనువదించే ధైర్యం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఇలాంటి అవసరమైన విషయాల్లో చర్యలు తీసుకునే ధైర్యం లేదని ఆయన స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నూతన విద్యా విధానం 2020ను అమలు చేయడంపై కొన్నాళ్లుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం నెలకొంది.


ఎన్ఈపీ పేరుతో హిందీ భాషను కేంద్రం బలవంతంగా రుద్దుతోందని సీఎం స్టాలిన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో భాష చుట్టూ నెలకొన్న వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడారు. వైద్య, ఇంజనీరింగ్ కోర్సులను తమిళంలోకి అనువదించే ధైర్యం డీఎంకే పార్టీకి లేదని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోర్సులను తమిళంలోకి అనువదించేలా చూస్తామని ఆయన తెలిపారు.

Also Read: కర్ణాటకలో హనీ ట్రాప్ దుమారం.. అసెంబ్లీ నుంచి 18 మంది బిజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్


ప్రజల దృష్టిని మళ్లించడానికే డీఎంకే పార్టీ భాషా వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని అమిత్ షా ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలను దాచాలనే ఉద్దేశంతో భాషా వివాదాన్ని తెరపైకి తెచ్చిందని ఆయన అన్నారు. హిందీ ఏ జాతీయ భాషతోనూ పోటీ పడదని, ఈ భాష కేవలం సామరస్యాన్ని పెంపొందిస్తుందని అమిత్ షా పునరుద్ఘటించారు. అన్ని భారతీయ భాషలకు హిందీ తోడుగా ఉంటుందని షా అన్నారు. దేశంలో హిందీ ఆధిపత్య పాత్ర కంటే సహాయక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని భాషా వైవిధ్యాన్ని బలోపేతం చేయడంలో, ప్రాంతీయ భాషల మధ్య పరస్పర సంబంధాన్ని పెంపొందించడంలో హిందీ సహాయపడుతుందని అమిత్ షా అన్నారు.

భాష పేరుతో దేశాన్ని విభజించే వారి అజెండా నెరవేరకుండా ఉండాలని తాను దేశ ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా తెలిపారు. అధికార భాషా శాఖ కింద ఎన్డీయే ప్రభుత్వం భారతీయ భాషల విభాగాన్ని ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, అస్సామీ, బెంగాళీ వంటి భాషల వినియోగాన్ని పెంపొందించడానికి ఈ శాఖ పని చేస్తుందని ఆయన తెలిపారు.

ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రాంతీయ భాషల్లో అధికారికి ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రారంభిస్తామని అమిత్ షా వెల్లడించారు. డిసెంబర్ తర్వాత పౌరులతో పాటు ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు తమ సొంత భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించవచ్చని ఆయన తెలిపారు. అవినీతిని దాచడానికి భాష పేరుతో తమ సొంత అజెండాను నడిపేవారికి ఇది తమ నుంచి వస్తున్న బలమైన సమాధానమని అమిత్ షా పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల భాషలను బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని వచ్చిన ఆరోపణలను కేంద్ర మంత్రి అమిత్ షా ఖండించారు.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×