E-Paper
Advertisement

Kuno National Park : కునో పార్కులో ఆగని చీతాల మరణాలు.. మరొకటి మృత్యువాత..

Kuno National Park :  కునో పార్కులో ఆగని చీతాల మరణాలు.. మరొకటి మృత్యువాత..
Advertisement

Kuno National Park : నమీబియా నుంచి దేశానికి తీసుకొచ్చిన మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటివరకు 10 చీతాలు మరణించాయి. తాజాగా మధ్యప్రదేశ్‌ లోని కునో నేషషల్ పార్కులో మరో చీతా మరణించింది. నమీబియా నుంచి తెచ్చిన శౌర్య అనే చీతా మంగళవారం మృతి చెందిందని అధికారులు ప్రకటించారు.

మంగళవారం ఉదయం చీతా నడవడానికిి ఇబ్బంది పడటాన్ని ట్రాకింగ్‌ బృందం గుర్తించింది. బలహీనంగా ఉన్న ఆ చీతాకు చికిత్స అందించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో చీతా చనిపోయిందని అధికారులు వెల్లడించారు. పోస్ట్‌మార్టం తర్వాతే చీతా మరణానికి గల కారణాలపై క్లారిటీ వస్తుందన్నారు.

Advertisement

అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని భారత్‌లో పునఃప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ‘ప్రాజెక్టు చీతా’ను చేపట్టింది. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు. ఆ చీతాలను కునో నేషనల్‌ పార్క్‌లో వదిలారు.

ఇందులో తొలుత ఆరు చీతాలు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయాయి. గతేడాది మార్చిలో జ్వాల అనే మరో నమీబియా చీతాకు నాలుగు కూనలు పుట్టాయి. అంందులో మూడు అనారోగ్య కారణాలతోనే మృత్యువాతపడ్డాయి. తాజాగా మరో చీతా మరణించడంతో ఇప్పటివరకు చనిపోయిన చీతాల సంఖ్య 10కి చేరింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×