E-Paper
Advertisement

Kerala : అనంతపద్మనాభ స్వామి ఆలయం.. మరోసారి మొసలి ప్రత్యక్షం..

Kerala : అనంతపద్మనాభ స్వామి ఆలయం.. మరోసారి మొసలి ప్రత్యక్షం..

Kerala : కేరళ అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే. దేశంలోనే అంతులేని సంపదకు ఇది చాలా ప్రసిద్ధి. ఈ గుడి ఎంత ఫేమసో.. ఆ గుడిలో సరస్సు కూడా అంతే ఫేమస్. ఇప్పుడీ కొలనులో మరో మొసలి ప్రత్యక్షమైంది. ఇప్పుడిది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గతంలో ఈ కొలనులో బబియా అనే మొసలి ఉండేది. ఇది శాఖహార మొసలి. భక్తులు ఇచ్చే పండ్లుఫలహారాలు తప్పు మరేవి తినదు. అందుకే గుడికి వచ్చిన భక్తులు ఈ మొసలిని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ మొసలి గతేడాది అక్టోబర్ 9, 2022న మరణించింది. ఇప్పుడీ బబియా స్థానంలో మరో మొసలి ప్రత్యక్షమైంది.

ఈ మొసలి ఎక్కడి నుంచి వచ్చింది..? ఎలా వచ్చింది? అనేది మిస్టరీగా మారింది. ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి కొలనులో కనిపించడం అనివార్యంగా వస్తోంది. అలా కనిపించిన వాటిలో బబియా అనే మొసలి మూడోవది. తాజాగా కనిపించింది నాలుగవది.

ఒకప్పుడూ ఈ కొలనులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని బ్రిటిష్‌ వాళ్లు కాల్చేయగా దాని స్థానంలో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. ఈ బబియా చనిపోయాక దాని.. మళ్లీ ఆ స్థానంలో మరో మొసలి రావడం అందరిని ఇప్పుడు షాక్‌కు గురి చేసింది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం ఒక విచిత్రమైతే.. ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం.

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×