BigTV English

Maharashtra Assembly Polls: మహారాష్ట్రలో ఒంటరిగానే బరిలోకి దిగనున్న ఆప్

Maharashtra Assembly Polls: మహారాష్ట్రలో ఒంటరిగానే బరిలోకి దిగనున్న ఆప్

Maharashtra Assembly Polls: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటిరిగానే పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించుకుంది. ముంబైలో మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత ప్రీతిశర్మ మీనన్ సోమవారం మీడియాకు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. కానీ జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో మా స్నేహం కొనసాగుతుంది. ఢిల్లీ, పంజాబ్ పాలన మోడల్‌ను చూపించే ఎన్నికలకు కూడా వెళతాం.


Also Read: సిద్ధరామయ్య రాజీనామాకు యెడ్యూరప్ప డిమాండ్.. అడిగే హక్కు లేదన్న సీఎం

మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలపై పట్టింపే లేదు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కూడా వాళ్లకు లేదు. సీఎం ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు గుజరాత్ కోసమే పని చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రయోజనాలు వారికి అవసరం లేదు అని మీనన్ విమర్శించారు. షిండే ప్రభుత్వం రాజ్యాంగాన్ని మోసం చేయడమే కాకుండా అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వెన్నువిరిచాయని అన్నారు. వ్యవసాయ సంక్షోభం, సంబంధిత రైతు ఆత్మహత్యలు నిరంతరం కొనసాగుతున్నాయి.


భారతదేశంలో అత్యంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం, పన్ను చెల్లింపు దారుల డబ్బును ప్రైవేట్ సహకార సంస్థలకు బ్యాంకు గ్యారంటీ గా ఉపయోగిస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలు, సమాజంలో అట్టడుగు వర్గాలు ఎక్కువగా హింస వివక్షతకు గురవుతున్నారని ఉద్యమకారులు ఆందోళన చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరాఠా రిజర్వేషన్ అంశంపై సీరియస్‌గా లేదని అన్నారు. ముంబైలోని బీఎంసీ సహా మహారాష్ట్రలోని 27 మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజా ప్రాతినిధ్యం లేదు. ముంబై యొక్క మౌలిక సదుపాయాలు నాసిరకంగా కూడా ఉన్నాయి. గృహ నిర్మాణం అపరిష్కృత సమస్యలుగానే మిగిలిపోయింది. మురికివాడలు ఎక్కువగా నివసించలేనివిగా మారుతున్నాయి. బిల్డర్, కాంట్రాక్టర్ మాఫియాలు నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయని ఆమె అన్నారు.

Also Read సిద్ధరామయ్య రాజీనామాకు యెడ్యూరప్ప డిమాండ్.. అడిగే హక్కు లేదన్న సీఎం

బీజేపీపై విమర్శలు చేసిన ఆమె భారతదేశంలో అతిపెద్ద కాస్మోపాలిటన్ నగరంగా ముంబై వైభవాన్ని కలిగి ఉంది. దేశ ఆర్థిక రాజధాని కూడా అన్నారు. ముంబై భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఇంజన్ అని పేర్కొన్నారు. ముంబైలో ఉద్దేశపూర్వకంగానే అభివృద్ధి జరగకుండా చేస్తున్నారని.. ముంబై కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించడం ద్వారా బీజేపీ గుజరాత్‌కు తరలిస్తోందన్నారు. ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు .

 

Related News

Shubhanshu Shukla: మోడీని కలిసిన శుభాంసు శుక్లా.. ప్రధాని కోసం అంతరిక్షం నుంచి ఏం తెచ్చాడో తెలుసా?

Cloud Burst: అసలు క్లౌడ్ బరస్ట్ ఏంటి..? దీనికి గల కారణాలేంటి..?

Gold In Odisha: ఒడిషాకు ‘బంగారు’ పంట.. నాలుగైదు జిల్లాల్లో బంగారం గనులు

CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

Rahul Gandhi: ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. సీఈసీ ఫైర్

National Highway: రూ.11వేల కోట్లతో నేషనల్ హైవే.. 20 నిమిషాల్లోనే ఎయిర్ పోర్టుకు..!

Big Stories

×