BigTV English

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్ జవాన్లను తరలిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు పడిన ప్రాంతం చాలా లోతుగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్స్‌ కాస్త ఆలస్యమవుతున్నాయి. తీవ్ర గాయాల కారణంగా ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన బసంత్‌గఢ్‌ ప్రాంతానికి రెస్క్యూ టీమ్స్‌ చేరుకున్నాయి.


సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్న కేంద్రమంత్రి
ఈ ప్రమాదంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ వార్త తనకు బాధ కలిగించిందని.. ఆ వాహనంలో ధైర్యవంతులైన జవాన్లు ఉన్నారన్నారు. సహాయక కార్యక్రమాలపై స్థానిక అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు స్వచ్చంధంగా వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు ఆయన.

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే, స్థానిక పోలీసులు, అంబులెన్స్ బృందాలు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లను తక్షణ వైద్య సహాయం కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న కొందరు జవాన్లను హాస్పిటల్‌కి ప్రత్యేక చికిత్స కోసం తరలించినట్లు తెలిపారు.


Also Read: రూ.20 కోట్లు.. 80 మంది పిల్లలు.. నమ్రత కేసులో సంచలనాలు

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద కారణాలను తెలుసుకుంటామని కూడా తెలిపారు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు ఎదుర్కొంటున్న సవాళ్లను మరోసారి గుర్తు చేస్తుంది

Related News

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Big Stories

×