APY Scheme: ప్రైవేట్ ఉద్యోగులు, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలవారీగా పెన్షన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ‘అటల్ పెన్షన్ యోజన'(APY) పథకాన్ని ప్రారంభించింది.
అటల్ పెన్షన్ పథకం (ఏపీవై) అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏపీవై కింద నెలకు రూ. 1000, 2000, 3000, 4000, 5000 చొప్పున ఖాతాదారులు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్ల దాటిన తరువాత నెలవారీగా పెన్షన్ అందుతుంది.
1. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఈ పథకంలో చేరవచ్చు.
2. బ్యాంకు లేదా పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి.
3. ఈ పథకంలో రిజిస్టర్ అయ్యే సమయంలో దరఖాస్తుదారుడు తన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ను బ్యాంకుకు తెలియజేయాలి. దీంతో ఎప్పటికప్పుడు ఏపీవై ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.
నెలకు రూ.5000 పెన్షన్ పొందాలంటే.. 18 ఏళ్ల వయసు వారు రూ.210 చెల్లించాలి. అదే 30 ఏళ్ల వయసులో ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ.577 చెల్లించాలి.
ఈ పథకం చేరిన వారి ప్రాన్ నంబర్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. చందాదారులు ఒక సంవత్సరానికి సంబంధించిన మొత్తం చందాను రూ.1000కి మించకుండా ఒకేసారి చెల్లించవచ్చు. దానికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
60 ఏళ్ల దాటిన తర్వాత నెలకు రూ. 1000, రూ.2000, రూ.3000, రూ.4000, రూ.5000 చొప్పున ఖాతాదారులు చెల్లించిన ప్రీమియం అనుసరించి పింఛన్ పొందుతారు.
Also Read: ఏసీ కొనేందుకు ఇదే సరైన సమయం.. 1.5 టన్ విండో ఏసీలపై 50 శాతం ధర తగ్గింపు.. ఎక్కడంటే
అటల్ పెన్షన్ యోజన ద్వారా కనీస పింఛన్ ప్రయోజనానికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. కనీసం పింఛన్ కన్నా.. కట్టిన ప్రీమియం ఎక్కువ అయితే, ఆ మొత్తాన్ని పింఛన్ కు కలిగి లబ్దిదారులకు అందిస్తుంది. ఈ పథకానికి పన్ను మినహాయింపు కూడా ఉంది.