BigTV English

Air India plane crash: విమానం ఘటన.. విదేశీ మీడియా ప్రచారంపై మంత్రి రామ్మోహన్ క్లారిటీ

Air India plane crash: విమానం ఘటన.. విదేశీ మీడియా ప్రచారంపై  మంత్రి రామ్మోహన్ క్లారిటీ

Air India plane crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలు, మీడియా నివేదికలపై నోరు విప్పారు కేంద్రం పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో-AAIB దర్యాప్తు పారదర్శకంగా చేస్తోందన్నారు. తుది నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఈ విషయంలో విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందన్నారు.


సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంపై రాజ్యసభ లో చర్చ జరిగింది. దీనిపై విపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు వివరణ ఇచ్చారు. జరిగిన ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందన్నారు.

ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని, ప్రస్తుతం దాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీనిపై తుది నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్విస్టిగేషన్‌ బ్యూరో-AAIB దర్యాప్తు చేస్తోందన్నారు.


ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని, ఇలాంటి సమయంలో సొంత అభిప్రాయాలు చెప్పకూడదన్నారు. విమాన ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో నిబంధనల ప్రకారమే దర్యాప్తు జరుగుతుందన్నారు. అంతర్జాతీయ ప్రోటోకాల్‌కు అనుగుణంగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

ALSO READ: ఆధార్ చల్లని కబురు.. ఇక పిల్లల సమస్యకు చెక్

ఘటనలో తాము నిజం వైపు నిలబడాలని కోరుకుంటున్నట్లు సభలో తెలిపారు సదరు మంత్రి. విమానంలో బ్లాక్‌ బాక్స్‌ల నుంచి డేటాను సేకరించామన్నారు. ప్రమాద సమయంలో విమానంలో ఏం జరిగిందన్నది తుది నివేదిక తర్వాత తెలుస్తుందన్నారు. అప్పటివరకు దర్యాప్తు ప్రక్రియను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు.

ప్రభుత్వం ప్రమాద బాధితుల మధ్య తేడాను చూడలేదన్నారు. ప్రయాణీకులు- మరణించిన వైద్య విద్యార్థులు సహా ఇతరులకు పరిహారం ఒకేలా ఉంటుందన్నారు. జూన్ 12న అహ్మదాబాద్ నుండి గాట్విక్‌కు 242 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ భవనంపైకి కూలిపోయింది. ఈ ఘటనలో 260 మంది మరణించారు. ఓ  ప్రయాణీకుడు స్వల్ప గాయాలతో బయటపడిన విషయం తెల్సిందే. ఘటన జరిగి నెల తర్వాత AAIB తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.

 

Related News

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

Big Stories

×