E-Paper
Advertisement

Flight Catches Fire: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 179 మంది!

Flight Catches Fire: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 179 మంది!

Air India Express Flight Catches Fire : శనివారం బెంగళూరు నుంచి కొచ్చికి బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టులోనే అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. విమానంలో మంటలు చెలరేగడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో ఎవరికీ గాయాలు కాలేదని, 179 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని పేర్కొంది.

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రతినిధి పీటీఐతో మాట్లాడుతూ.. విమానంలో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకుండా, హాని జరగకుండా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారని తెలిపారు. వారంతా త్వరగా తమ గమ్యాలను చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. మే 18, 2024న.. బెంగుళూరు నుండి కొచ్చికి వెళ్తున్న IX 1132 విమానం 23.12 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలిపారు. విమానం బయల్దేరిన కొద్దినిమిషాలకే మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు తెలిపారు.

సిబ్బంది అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయకపోయినా.. ల్యాండింగ్ ఫెయిలైనా పెనుప్రమాదం జరిగేదన్నారు. మంటలను గమనించిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందించారు. అనంతరం పూర్తి స్థాయి ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎమర్జెన్సీ ఫైర్ కంట్రోల్ టీమ్‌లు బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకుని ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే మంటల్ని ఆర్పివేశాయి. ఇంజిన్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×