E-Paper
Advertisement

మే 4న బిగ్ టీవీలో ‘మహా సంగ్రామం’.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మెగా కవరేజ్!

మే 4న బిగ్ టీవీలో ‘మహా సంగ్రామం’.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మెగా కవరేజ్!
Advertisement

BIG TV election results live coverage: దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది తీర్పుకు సమయం ఆసన్నమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో మే 4వ తేదీన తేలిపోనుంది. 5 రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై బిగ్ టీవీ (BIG TV) అత్యంత వేగవంతమైన, ఖచ్చితమైన విశ్లేషణలతో మీ ముందుకు రానుంది. మే 4న ఉదయం 7 గంటల నుంచే నిరంతరాయంగా లైవ్ కవరేజ్ ప్రారంభం కానుంది. ప్రతి నిమిషం మారుతున్న ట్రెండ్స్, కీలక అభ్యర్థుల గెలుపోటములు, నియోజకవర్గాల వారీగా స్పష్టమైన గణాంకాలను అందించడానికి మా బిగ్ టీవీ టీం సర్వసన్నద్ధమైంది.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొడతారా? లేక బీజేపీ పాగా వేస్తుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరోవైపు తమిళనాడులో డీఎంకే ఆధిపత్యానికి నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ఏ మేరకు గండి కొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. కేరళలో కూటముల మధ్య పోరు, అస్సాంలో బీజేపీ పట్టు.. ఇలా అన్ని రాష్ట్రాల సమగ్ర ఫ‌లితాల‌ను బిగ్ టీవీ తన ప్రత్యేక గ్రాఫిక్స్, క్షేత్రస్థాయి రిపోర్టింగ్‌తో కళ్లకు కట్టినట్లు చూపనుంది.

Advertisement

ఉదయం 7 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం కాగానే తొలి ట్రెండ్స్‌ను బిగ్ టీవీ అందిస్తుంది. సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులతో కూడిన ప్యానెల్ చర్చలు ఫలితాల వెనుక ఉన్న లోతైన అర్థాలను వివరించనున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి? మ్యాజిక్ ఫిగర్ దిశగా ఎవరు దూసుకుపోతున్నారు? కింగ్ మేకర్లు ఎవరు కాబోతున్నారు? వంటి ప్రతి చిన్న అంశాన్ని బిగ్ టీవీలో మీరు వీక్షించవచ్చు. మీ టీవీలు, మొబైల్స్‌లో బిగ్ టీవీని అనుసరిస్తూ దేశ రాజకీయ దిశను మార్చబోయే ఈ తీర్పును ప్రత్యక్షంగా చూడండి.

Read Also: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. నేరుగా రైతుల నుంచే కొనుగోళ్ళు..?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×