BigTV English
Advertisement

MCD: చిత్తుచిత్తుగా కొట్టుకున్న కౌన్సిలర్లు.. ఢిల్లీలో డిష్యూం డిష్యూం..

MCD: చిత్తుచిత్తుగా కొట్టుకున్న కౌన్సిలర్లు.. ఢిల్లీలో డిష్యూం డిష్యూం..

MCD: కొట్టుకున్నారు. తన్నుకున్నారు. గుద్దుకున్నారు. నెట్టుకున్నారు. చొక్కాలు చించుకున్నారు. సిగలు పట్టుకుని పొట్లాడుకున్నారు. నానారచ్చ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్-MCD రణరంగంగా మారింది. ఆ దృష్యాలు చూస్తుంటే.. వీరా ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లు అనిపిస్తోంది. స్ట్రీట్ ఫైట్ మాదిరి.. సభలో బీజేపీ, ఆప్ సభ్యులు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు.


స్టాండిగ్ కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహణ ఇలా ముష్టియుద్ధానికి దారి తీసింది. అభ్యర్థులు వేసిన ఒక ఓటు చెల్లలేదని మేయర్‌ ప్రకటించడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను అడ్డుకుంటూ బీజేపీ సభ్యులు రెచ్చిపోయారు. ఏకంగా మేయర్ షెల్లి ఓబెరాయ్ పైనే దాడికి దిగారు. పోలీసులు ఆపుతున్నా ఆగలేదు. మెజార్టీ బీజేపీ, ఆప్ సభ్యులు ఘర్షణకు దిగడంతో.. కౌన్సిల్‌లో రచ్చ రచ్చ నడిచింది.

జై శ్రీరామ్‌, జై మోదీ అంటూ బీజేపీ సభ్యులు పెద్దగా నినాదాలు చేశారు. ఆప్ వర్గమేమో.. ‘ఆమ్‌ ఆద్మీపార్టీ జిందాబాద్‌.. అర్వింద్‌ కేజ్రీవాల్‌ జిందాబాద్‌’ అంటూ గొంతెత్తుకుంది. ఇలా సభ హోరెత్తిపోయింది.


పరస్పర దాడిలో చాలా మందికి గాయాలయ్యాయి. కొంతమంది బట్టలు చిరిగిపోయాయి. ఓ కౌన్సిలర్ మూర్చపోయి కిందపడిపోయారు.

ఎంసీడీ ఎన్నికల్లో ఆప్‌ 134 స్థానాలు గెలిచింది. తాజాగా ఒక ఆప్‌ సభ్యుడు బీజేపీలో చేరాడు. దీంతో ఆప్‌ బలం 133కు తగ్గింది. శుక్రవారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆప్‌కు 138 మంది సభ్యుల ఓట్లు పడ్డాయి. ఐదుగురు బీజేపీ సభ్యులు ఆప్‌కి క్రాస్‌ ఓటింగ్‌ చేసినట్టు తెలుస్తోంది. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో​ తామే గెలిచామని ఆప్‌ నేతలు చెబుతున్నా.. బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.

Related News

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Big Stories

×