BigTV English
Advertisement

Maharashtra MLC elections : మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపీ కూటమి విజయం.. ఏ పార్టీకి ఎన్ని వచ్చాయంటే..

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల ‘మహాయుతి’ కూటమి విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 11 సీట్ల ఎన్నికల్లో 9 సీట్లు మహాయుతి గెలుచుకుంది. మరి కొన్ని నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్ లాంటివని అందులో తాము విజయం సాధించామని ఏక్ నాథ్ షిండ్ అన్నారు.

Maharashtra MLC elections : మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపీ కూటమి విజయం.. ఏ పార్టీకి ఎన్ని వచ్చాయంటే..

Maharashtra MLC elections(Latest political news in India): మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల ‘మహాయుతి’ కూటమి విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 11 సీట్ల ఎన్నికల్లో 9 సీట్లు మహాయుతి గెలుచుకుంది. మరి కొన్ని నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్ లాంటివని అందులో తాము విజయం సాధించామని ఏక్ నాథ్ షిండ్ అన్నారు. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న శివసేన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ ఎన్ సీపీ, కాంగ్రెస్ పార్టీల ‘మహా వికాస్ అఘాడీ’ కూటమికి రెండు ఎమ్మెల్సీ సీట్లు దక్కాయి.


అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 11 సీట్లకు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ కూటమి కేవలం మూడు సీట్లపైన మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసింది.

Also Read| రైతులను తుపాకీతో బెదిరిస్తూ ట్రైనీ ఐఏఎస్ అధికారి తల్లి హల్‌చల్‌


బిజేపీ తరపున పంకజ మొండే, యోగేష్ తిలేకర్, పరినయ్ ఫూకే, అమిత్ గోర్ఖే, సదాభౌ ఖోటే.. ఈ అయిదుగురు విజయం సాధించారు. అజిత్ పవార్ ఎన్ సీపీకి చెందిన రాజేష్ విటేకర్, శివాజీ రావ్ గర్జే, గెలుపొందారు. అలాగే ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీ తరపున కృపాల్ తుమానె, భావన గవాలి ఎన్నికల్లో విజయం సాధించారు. పోటీ చేసిన తొమ్మిది సీట్లపై విజయం సాధించడంతో మహాయుతి కూటమి నాయకులు ఉత్సాహంగా విజయ వేడుకలు చేసుకుంటున్నారు.

ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ తరపున ప్రదాన్య రాజీవ్ సతవ్, మిలింద్ నార్వేకర్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు.

మహాయుతి కూటమి పోటీ చేసిన అన్ని సీట్లు గెలుపొందడం వెనుక కాంగ్రెస్ నాయకులు క్రాస్ ఓటింగ్ చేయడం కూడా ప్రధాన కారణం. మొత్తం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీలకు క్రాస్ ఓటింగ్ చేశారని స్థానిక మీడియా తెలిపింది.

Also Read| మోదీ ప్రభుత్వం పూర్తికాలం నిలబడేలా లేదు: దీదీ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి రచించిన వ్యూహాలు విజయవంతమయ్యాయని మహాయుతి నాయకులు చెప్పారు. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముందుగానే ఒప్పించారని విశ్లేషకుల అభిప్రాయం.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×