E-Paper
Advertisement

Income from EB Scheme to BJP: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి ₹1300 కోట్లు.. కాంగ్రెస్ కన్నా ఏడు రెట్లు ఎక్కువ!

Income from EB Scheme to BJP: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి ₹1300 కోట్లు.. కాంగ్రెస్ కన్నా ఏడు రెట్లు ఎక్కువ!
BJP Income Through Electoral Bonds Scheme

Electoral Bonds Scheme income to BJP: అధికార భారతీయ జనతా పార్టీ(BJP) 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దాదాపు ₹1300 కోట్లు పొందింది. కాంగ్రెస్ అదే మార్గంలో పొందిన దాని కంటే ఏడు రెట్లు ఎక్కువ.

2022-23 ఆర్థిక సంవత్సరంలో BJP మొత్తం విరాళాలు ₹2120 కోట్లుగా ఉన్నాయి. వీటిలో 61 శాతం ఎలక్టోరల్ బాండ్ల నుండి వచ్చినవే అని పార్టీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదిలో పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పార్టీ మొత్తం విరాళాలు ₹ 1775 కోట్లు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో పార్టీ ఆదాయం ₹1917 కోట్లగా ఉండగా.. 2022-23లో పార్టీ మొత్తం ఆదాయం ₹2360.8 కోట్లకు పెరిగింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో ₹236 కోట్లగా ఉన్న కాంగ్రెస్ ఎలక్టోరల్ బాండ్ల విలువ.. 2022-23లో ₹171 కోట్లకు తగ్గింది.

Read More: 17వ లోక్ సభ.. మోదీ చివరి స్పీచ్..

బీజేపీ, కాంగ్రెస్‌లు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఇక రాష్ట్ర పార్టీ విషయాలకొస్తే.. సమాజ్ వాదీ పార్టీ, 2021-22లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹3.2 కోట్లు సంపాదించింది. 2022-23లో, ఈ బాండ్ల నుండి దీనికి ఎటువంటి విరాళాలు రాలేదు.

మరో రాష్ట్ర పార్టీ టీడీపీ 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹34 కోట్లు సంపాదించింది, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 10 రెట్లు పెరిగింది.

బీజేపీ కేవలం వడ్డీల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో ₹237 కోట్లు సంపాదించింది. 2021-22లో ఇది ₹135 కోట్లుగా ఉంది.

బీజేపీ మొత్తం వ్యయంలో, ఎన్నికల ప్రచారం, సాధారణ ప్రచారంపై విమానాలు, హెలికాప్టర్ల వినియోగానికి BJP ₹78.2 కోట్లు చెల్లించింది, ఇది 2021-22లో ₹117.4 కోట్లుగా ఉంది.

2022-23లో పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయంగా ₹76.5 కోట్లు చెల్లించింది. 2021-22లో ఇది ₹ 146.4 కోట్లుగా నమోదయ్యింది. ‘మొత్తం చెల్లింపులు’ శీర్షిక కింద పార్టీ ఈ సహాయాన్ని చూపింది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×