E-Paper
Advertisement

Income from EB Scheme to BJP: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి ₹1300 కోట్లు.. కాంగ్రెస్ కన్నా ఏడు రెట్లు ఎక్కువ!

Income from EB Scheme to BJP: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి ₹1300 కోట్లు.. కాంగ్రెస్ కన్నా ఏడు రెట్లు ఎక్కువ!
Advertisement
BJP Income Through Electoral Bonds Scheme

Electoral Bonds Scheme income to BJP: అధికార భారతీయ జనతా పార్టీ(BJP) 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దాదాపు ₹1300 కోట్లు పొందింది. కాంగ్రెస్ అదే మార్గంలో పొందిన దాని కంటే ఏడు రెట్లు ఎక్కువ.

2022-23 ఆర్థిక సంవత్సరంలో BJP మొత్తం విరాళాలు ₹2120 కోట్లుగా ఉన్నాయి. వీటిలో 61 శాతం ఎలక్టోరల్ బాండ్ల నుండి వచ్చినవే అని పార్టీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదిలో పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పార్టీ మొత్తం విరాళాలు ₹ 1775 కోట్లు.

Advertisement

2021-22 ఆర్థిక సంవత్సరంలో పార్టీ ఆదాయం ₹1917 కోట్లగా ఉండగా.. 2022-23లో పార్టీ మొత్తం ఆదాయం ₹2360.8 కోట్లకు పెరిగింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో ₹236 కోట్లగా ఉన్న కాంగ్రెస్ ఎలక్టోరల్ బాండ్ల విలువ.. 2022-23లో ₹171 కోట్లకు తగ్గింది.

Advertisement

Read More: 17వ లోక్ సభ.. మోదీ చివరి స్పీచ్..

బీజేపీ, కాంగ్రెస్‌లు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఇక రాష్ట్ర పార్టీ విషయాలకొస్తే.. సమాజ్ వాదీ పార్టీ, 2021-22లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹3.2 కోట్లు సంపాదించింది. 2022-23లో, ఈ బాండ్ల నుండి దీనికి ఎటువంటి విరాళాలు రాలేదు.

మరో రాష్ట్ర పార్టీ టీడీపీ 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹34 కోట్లు సంపాదించింది, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 10 రెట్లు పెరిగింది.

బీజేపీ కేవలం వడ్డీల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో ₹237 కోట్లు సంపాదించింది. 2021-22లో ఇది ₹135 కోట్లుగా ఉంది.

బీజేపీ మొత్తం వ్యయంలో, ఎన్నికల ప్రచారం, సాధారణ ప్రచారంపై విమానాలు, హెలికాప్టర్ల వినియోగానికి BJP ₹78.2 కోట్లు చెల్లించింది, ఇది 2021-22లో ₹117.4 కోట్లుగా ఉంది.

2022-23లో పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయంగా ₹76.5 కోట్లు చెల్లించింది. 2021-22లో ఇది ₹ 146.4 కోట్లుగా నమోదయ్యింది. ‘మొత్తం చెల్లింపులు’ శీర్షిక కింద పార్టీ ఈ సహాయాన్ని చూపింది.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×