Bullet Train Job Recruitment: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది దీన్ని ప్రారంభించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్- NHSRCL. వివిధ విభాగాల పోస్టులకు ఐటీఐ పాసైతే చాలు.. జీతం లక్ష పైమాటే. ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేయండి.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు- దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం సాంకేతిక విభాగాలలో 237 టెక్నీషియన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్-NHSRCL. అర్హులైన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. అధికారిక NHSRCL వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
నెలకు జీతం లక్ష పైమాటే-దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 5 వరకు ఉంది. ఈ నియామక ప్రక్రియ సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, టెలికాం, రోలింగ్ స్టాక్ వంటి పలు విభాగాలలో అవకాశాలను అందిస్తుంది.ఎంపికైన అభ్యర్థులను ముంబై–అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ లేదా ఇతర NHSRCL యూనిట్ల కింద నియమిస్తారు.
ఐటీఐ లేదా డిప్లొమా పాసైతే చాలు- అందులో ఎలక్ట్రికల్, సిగ్నలింగ్-టెలికాం, సివిల్-ట్రాక్ ఫిట్టర్, మెకానిక్, ఫిట్టర్, వెల్డర్ వంటి విభాగాలు ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష-CBT ద్వారా పత్రాల ధృవీకరణ జరగనుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,000 నుంచి రూ.1.10 లక్షల వరకు జీతం అందనుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పూర్తి చేయాలి.
అర్హతలు ఇవే-టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ITI, సంబంధిత ట్రేడ్లో అప్రెంటిస్షిప్తో కూడిన మెట్రిక్యులేషన్, సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. దరఖాస్తుదారులు రైల్వేలు, మెట్రో రైలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైల్వే వ్యవస్థలు లేదా రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్-RRTS ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు. అర్హతలు కలిగిన వారు ఆగస్ట్ 5 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ.400 చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రుసుము మినహాయింపు. ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటాయి.
ALSO READ: నిక్కర్లో మూత్రం.. ప్రైవేటు పార్టుపై టీచర్ వాతలు, వారణాసిలో షాకింగ్ ఘటన
తొలుత కంప్యూటర్ ఆధారిత పరీక్ష-CBT ఉంటుంది. ఆ తర్వాత పత్రాలు ధృవీకరణ, చివరగా వైద్య పరీక్షలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు ఏడాదిపాటు ప్రొబేషన్ ఉంటుంది. దరఖాస్తుదారులు ప్రకటనను జాగ్రత్తగా చదవి, తమ అర్హతను సరి చూసుకోవాలని సూచన చేసింది.