E-Paper
Advertisement

నిక్కర్‌లో మూత్రం.. ప్రైవేటు పార్టుపై టీచర్ వాతలు, వారణాసిలో షాకింగ్ ఘటన

నిక్కర్‌లో మూత్రం.. ప్రైవేటు పార్టుపై టీచర్ వాతలు, వారణాసిలో షాకింగ్ ఘటన
Advertisement

Varanasi: యూపీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నర్సరీ చదువుతున్న బాలుడు నిక్కర్‌లో మూత్రం పోశాడు. దీంతో కోపానికి గురైన ఉపాధ్యాయురాలు, బాలుడి మర్మాంగంపై వాతలు పెట్టింది. నాలుగైదు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

వారణాసిలో షాకింగ్ ఘటన- వారణాసిలోని పాండేపూర్ ప్రాంతంలోని షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో కేసరి కుమార్ అనే వ్యక్తి తన కొడుకును ప్లే స్కూల్‌లో చేర్పించాడు. తాను యూరిన్‌కు వస్తోందని బాత్‌రూంకు వెళ్తానని టీచర్‌ని కోరాడు. అందుకు సదరు టీచర్ ప్రీతి కుష్వాహాగా  అనుమతి నిరాకరించింది. దీంతో ఆ బాలుడు తన ప్యాంటులో మూత్ర విసర్జన చేశాడు.

Advertisement

నిక్కర్‌లో మూత్రం పోసిన బాలుడు-ఈ ఘటనతో ఉపాధ్యాయురాలికి కోపం రెట్టింపు అయ్యింది. దీంతో ఉపాధ్యాయురాలు ఆ బాలుడిని మరొక గదిలోకి తీసుకెళ్లింది. బాలుడ్ని కొట్టి, కత్తిని వేడి చేసి బాలుడి ప్రైవేటు పార్ట్స్‌పై వాతలు పెట్టింది. మళ్లీ ఇలాంటి తప్పు చేయవద్దని బాలుడ్ని హెచ్చరించింది. బాలుడు ఇంటికి వచ్చిన నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు.

ప్రైవేటు పార్టుపై టీచర్ వాతలు –  కాలిన మచ్చలు కనిపించడంతో బాలుడు తల్లి, తన భర్తకు చెప్పింది. మరుసటి రోజు తల్లిదండ్రులు ప్లే స్కూల్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. ఫలితం లేకపోవడంతో బాధితుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. ఉపాధ్యాయురాలు- స్కూల్ ప్రిన్సిపాల్, యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

Advertisement

కేసు నమోదు చేసిన పోలీసులు-వారిపై వివిధ  సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. ఇది అత్యంత తీవ్రమైన, బాధాకరమైన, భయంకరమైన ఘటనగా తెలిపారు. ఆ చిన్నారి జీవితాంతం నిలిచిపోతుందని అన్నారు. ఉపాధ్యాయులకు పిల్లల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు. తక్షణమే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ALSO READ: విజయ్ ప్రభుత్వానికి ఊహించని షాక్.. ఆ జీవోలను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు!

Related News

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!

వాహనదారులకు గుడ్‌న్యూస్.. టోల్‌ ప్లాజాల వద్ద ఆగకుండానే నేరుగా, ఫిబ్రవరి నుంచే అమల్లోకి!

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

Big Stories

Advertisement
×