Varanasi: యూపీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నర్సరీ చదువుతున్న బాలుడు నిక్కర్లో మూత్రం పోశాడు. దీంతో కోపానికి గురైన ఉపాధ్యాయురాలు, బాలుడి మర్మాంగంపై వాతలు పెట్టింది. నాలుగైదు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
వారణాసిలో షాకింగ్ ఘటన- వారణాసిలోని పాండేపూర్ ప్రాంతంలోని షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో కేసరి కుమార్ అనే వ్యక్తి తన కొడుకును ప్లే స్కూల్లో చేర్పించాడు. తాను యూరిన్కు వస్తోందని బాత్రూంకు వెళ్తానని టీచర్ని కోరాడు. అందుకు సదరు టీచర్ ప్రీతి కుష్వాహాగా అనుమతి నిరాకరించింది. దీంతో ఆ బాలుడు తన ప్యాంటులో మూత్ర విసర్జన చేశాడు.
నిక్కర్లో మూత్రం పోసిన బాలుడు-ఈ ఘటనతో ఉపాధ్యాయురాలికి కోపం రెట్టింపు అయ్యింది. దీంతో ఉపాధ్యాయురాలు ఆ బాలుడిని మరొక గదిలోకి తీసుకెళ్లింది. బాలుడ్ని కొట్టి, కత్తిని వేడి చేసి బాలుడి ప్రైవేటు పార్ట్స్పై వాతలు పెట్టింది. మళ్లీ ఇలాంటి తప్పు చేయవద్దని బాలుడ్ని హెచ్చరించింది. బాలుడు ఇంటికి వచ్చిన నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు.
ప్రైవేటు పార్టుపై టీచర్ వాతలు – కాలిన మచ్చలు కనిపించడంతో బాలుడు తల్లి, తన భర్తకు చెప్పింది. మరుసటి రోజు తల్లిదండ్రులు ప్లే స్కూల్కు వెళ్లి ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. ఫలితం లేకపోవడంతో బాధితుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. ఉపాధ్యాయురాలు- స్కూల్ ప్రిన్సిపాల్, యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు-వారిపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. ఇది అత్యంత తీవ్రమైన, బాధాకరమైన, భయంకరమైన ఘటనగా తెలిపారు. ఆ చిన్నారి జీవితాంతం నిలిచిపోతుందని అన్నారు. ఉపాధ్యాయులకు పిల్లల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు. తక్షణమే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ALSO READ: విజయ్ ప్రభుత్వానికి ఊహించని షాక్.. ఆ జీవోలను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు!