Jio Technician: అబ్బా.. ఎంత కోపం వస్తే మాత్రం మరీ మనిషిని తీసుకెళ్లి టవర్కే కట్టేస్తారా? మనం రోజువారీ లైఫ్లో ఇంటర్నెట్ స్లో అయితేనే ఊగిపోతుంటాం, కానీ యూపీలోని ఒక గ్రామంలో జనాలు చేసిన పని చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. సరిగ్గా సిగ్నల్ రావడం లేదన్న ఆక్రోశంతో పనిమీద వచ్చిన ఒక నెట్వర్క్ ఉద్యోగిని ఏకంగా మొబైల్ టవర్కే కట్టేసి తమ నిరసన తెలిపారు.
అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లా, హరదౌలి గ్రామంలో గత రెండేళ్లుగా జియో 5G సిగ్నల్ సరిగ్గా అందడం లేదు. రోజువారీ డిజిటల్ పనుల నుంచి ఆన్లైన్ పేమెంట్ల వరకు నెట్వర్క్ లేక ఊరి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తుల్లో తీవ్ర అసహనం నెలకొంది. ఈ క్రమంలోనే నెట్వర్క్ సమస్యను పరిశీలించి, సరిచేయడానికి ఒక జియో టెక్నీషియన్ గ్రామానికి వచ్చాడు. ఇక అంతే.. అతడిని చూసిన వెంటనే కోపంతో రగిలిపోతున్న ఊరి జనాలు ఒక్కసారిగా చుట్టుముట్టారు. మాట మాట పెరగడంతో, అతనిపై కోపాన్ని ప్రదర్శిస్తూ నిమిషాల్లోనే టవర్కు తాడుతో కట్టేశారు.
పోలీసుల ఎంట్రీ, కేసు నమోదు
అలా ఆ టెక్నీషియన్ దాదాపు రెండు గంటల పాటు టవర్కే బంధీగా ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని, గ్రామస్తులకు నచ్చజెప్పి అతడిని సురక్షితంగా విడిపించారు. తనకు జరిగిన ఈ అనుభవంపై సదరు టెక్నీషియన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తుతెలియని గ్రామస్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నెట్వర్క్ సరిగ్గా రాకపోతే కంపెనీపై కోపం చూపించాలి గానీ, కష్టపడి పనిచేసే ఉద్యోగిని ఇలా బంధించడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బీఆర్ఎస్పై ఫ్లాష్ సర్వేలో ఏం తేలింది?.. సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
5G సిగ్నల్ సరిగ్గా రాలేదని జియో ఉద్యోగిని టవర్కు కట్టేసిన గ్రామస్థులు!
యూపీలోని ఫతేపూర్ హరదౌలి గ్రామంలో ఘటన#viralvídeo @Trendingvideos pic.twitter.com/bq4BiSDh7R
— Donkana Vamsi (@DonkanaV0713) September 11, 2026