BigTV English

Rajasthan Express way Accident : రాంగ్ యూ టర్న్.. ట్రక్కు-కారు ఢీ.. ఆరుగురు మృతి

Rajasthan Express way Accident : రాంగ్ యూ టర్న్.. ట్రక్కు-కారు ఢీ.. ఆరుగురు మృతి

Rajasthan Highway Accident : రాజస్థాన్ లోని ఢిల్లీ – ముంబై ఎక్స్ ప్రెస్ వే పై జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ట్రక్ రాంగ్ యూటర్న్ తీసుకుంటుండగా.. దాని వెనుకే ఉన్న కారు ట్రక్కును ఢీ కొట్టింది. ప్రమాదంలో మరణించినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు.


సవాయి మాధోపూర్ జిల్లాలోని బనాస్ నది వంతెన సమీపంలో జరిగిన ప్రమాదం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందులో ట్రక్ డ్రైవర్ దే తప్పని స్పష్టంగా తెలుస్తోంది. ట్రక్కు, దాని వెనుక కారు వెళ్తుండగా.. ట్రక్కు అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకుంది. వేగంగా వెళ్తున్న కారు.. యూటర్న్ తీసుకుంటున్న ట్రక్కును ఢీ కొట్టింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకునేలోపే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

Also Read : బాచుపల్లిలో తీవ్ర విషాదం.. గోడ కూలి ఏడుగురు దుర్మరణం, సీఎం దిగ్భ్రాంతి


ప్రమాదంలో మరణించినవారిని మనీష్ శర్మ, అనితా శర్మ, సతీష్ శర్మ, పూనమ్, సంతోష్, కైలాష్‌లుగా గుర్తించారు. సికార్ జిల్లా నుంచి రణతంబోర్‌లోని త్రినేత్ర గణేష్ ఆలయానికి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఇద్దరు చిన్నారులు జైపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని వెతికి పట్టుకుంటామని ఎస్పీ దినేష్ కుమార్ వెల్లడించారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×