E-Paper
Advertisement

Mask Rule : విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధన ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం..

Mask Rule : విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధన ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం..
Advertisement

Mask Rule: ఇకపై విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కేసులు తగ్గుతున్నప్పటికీ మాస్కులు ధరించడమే మంచిదేనని సూచించింది. ప్రయాణికులు మాస్కులు ధరించడం వారి ఇష్టమేనని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు విమాన ప్రయాణికులు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. ఈ నిబంధనను కఠినంగా అమలు చేశారు. ఇకపై విమానాల్లో మాస్క్ లు ధరించకపోయినా ప్రయాణికులకు ఎలాంటి జరిమానాలు , శిక్షలు ఉండవని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

Advertisement

దేశంలో బుధవారం 501 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 7,561 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా కేసుల రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. దీంతో విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. ఇప్పటికే కరోనా విషయంలో దాదాపు అన్ని నిబంధనలను కేంద్రం సడలించింది.

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×