E-Paper
Advertisement

Uniform Pension Scheme : దేశంలో ప్రజలందరికీ పెన్షన్.. కొత్త పథకం తీసుకురానున్న కేంద్రం

Uniform Pension Scheme : దేశంలో ప్రజలందరికీ పెన్షన్.. కొత్త పథకం తీసుకురానున్న కేంద్రం
Advertisement

Uniform Pension Scheme | భారతదేశంలోని ప్రజలందరికీ  పెన్షన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకంపై  తీసుకురాబోతోంది.ఈ పథకాన్ని “యూనివర్సల్ పెన్షన్ స్కీమ్” అని పేరు ప్రకటించారు. ప్రతి పౌరుడికి  ఈ పథకం ద్వారా  వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రంలోని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకం రూపొందించేందుకు  పనులు ప్రారంభించింది. ఇది స్వచ్ఛంద, సహకారాత్మక పథకంగా ఉంటుంది, ఏ ఉపాధికి సంబంధించినది కాదు. ఎవరైనా దీనికి సహకరించి పెన్షన్ పొందవచ్చు. ఈ పథకాన్ని ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.

అయితే ఈ పథకంలో పాత పెన్షన్ పథకాలను కూడా విలీనం చేయనున్నట్లు సమాచారం. ఇది అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటుంది. అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు,  60 సంవత్సరాల వయస్సు తర్వాత పెన్షన్ పొందవచ్చు.

Advertisement

Also Read: పనిగంటలు కాదు ఫలితాలు ముఖ్యం.. వారానికి 5 రోజులు చాలు.. టెక్ కంపెనీ సీఈఓ

ప్రభుత్వం అమలు చేస్తున్న సేవింగ్ స్కీమ్ పథకాలేవి ప్రస్తుతం నిర్మాణ కూలీలు, ఇంటి పనిమనుషులు, గిగ్ వర్కర్లు (డెలివరీ బాయ్స్) వంటి అసంఘటిత కార్మికుల వర్తించవు. అందుకే వీరందరికీ ఆర్థిక భద్రత అవసరమని భావించి కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ పెన్షన్ స్కీమ్ రూపొందించే పనిలో పడింది.

Advertisement

ప్రస్తుతం ఉన్న పొదుపు,  పెన్షన్ పథకాలను హేతుబద్ధీకరించి, ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వారితో పాటు, ఉద్యోగంలో లేనివారు కూడా ఈ పథకంలో చేరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలపై పనులు ప్రారంభమైనట్లు,  త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ పథకంలో ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన (PM-SYM) మరియు జాతీయ పెన్షన్ పథకం (NPS-ట్రేడర్స్) వంటి పథకాలను కూడా విలీనం చేయవచ్చు. ఈ పథకాలలో 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ అందించబడుతుంది. అయితే ఈ లాభాలు పొందడానికి ప్రతి నెలా రూ.55 నుండి రూ.200 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం కూడా డిపాజిట్ చేసిన మొత్తానికి సమానమైన మొత్తాన్ని జమ చేస్తుంది.

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×