BigTV English

PM Modi Visits Wayanad: వయనాడ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఏం చెప్పారంటే?

PM Modi Visits Wayanad: వయనాడ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఏం చెప్పారంటే?
Advertisement

PM Modi Visits Wayanad: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేరళకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చూస్తామంటూ ప్రధాని భరోసా ఇచ్చారు.


వయనాడ్ లో పర్యటించిన తరువాత అక్కడి పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ రాష్ట్రానికి అండగా ఉంటామన్నారు. కొండచరియలు విరిగిపడిన రోజే సీఎం పినరయి విజయన్ తో తాను మాట్లాడానన్నారు. ప్రకృతి విలయంలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారంటూ ఆయన పేర్కొన్నారు. ఈ విపత్తు సాధారణమైనది కాదు.. వేలాది కుటుంబాల కలలు కల్లలుగా మారాయంటూ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితిని చూశాను.. బాధితులను కలిశాను.. మృతుల కుటుంబాలకు అండంగా ఉంటామంటూ మోదీ హామీ ఇచ్చారు. వయనాడ్ లో పరిస్థితి మెరుగుపడేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Also Read: వయనాడ్‌లో ఏరియల్ సర్వే చేసిన ప్రధాని మోదీ


కాగా, కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడి బాధితులను ఆయన పరామర్శించారు. ఈ విపత్తులో 300 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని వెంట సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి, రాష్ట్ర మంత్రులు ఉన్నారు.

Tags

Related News

Maoist Surrender: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. ఛత్తీస్‌గఢ్‌లో 170 మంది లొంగుబాటు

Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

Delhi News: కోర్టు ప్రొసీడింగ్స్.. మహిళకు కిస్ ఇచ్చిన లాయర్, సోషల్‌మీడియాలో రచ్చ, వీడియో వైరల్

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 27 మంది మావోయిస్టులు

Supreme Court: దీపావళి బాణాసంచా పేలుళ్ల పై.. సుప్రీం రూల్స్

Goa: తీవ్ర విషాదం.. గోవా మాజీ సీఎం కన్నుమూత

PM Shram Yogi Maan Dhan scheme: రూ.55 చెలిస్తే చాలు.. ప్రతీ నెలా 3 వేల రూపాయలు, ఆ పథకం వివరాలేంటి?

IPS Puran Kumar: ఐపీఎస్‌ పూరన్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌.. మరో పోలీస్ అధికారి సూసైడ్

Big Stories

×