BigTV English

Chennai Airport Flight : విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. ల్యాండింగ్ చివరి నిమిషంలో మళ్లీ గాల్లోకి

Chennai Airport Flight : విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. ల్యాండింగ్ చివరి నిమిషంలో మళ్లీ గాల్లోకి

Chennai Airport Flight | చెన్నై ఎయిర్‌పోర్టులో తృటిలో విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ల్యాండ్ చేసే క్రమంలో ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ చివరి నిమిషంలో విమానాన్ని మళ్లీ గాల్లోకి లేపారు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులందరూ భయందోళనకు గురయ్యారని సమాచారం.


బంగాళాఖాతంలో ఏర్పడ్డ భారీ అల్పపీడనం వల్ల ఫెంగల్ తుఫాను శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షలు కురుస్తుండడంలో తమిళనాడు రాష్ట్రానికి రాకపోకలు బంద్ అయ్యాయి. తుఫాన్ కారణంగా చెన్నై ఎయిర్‌పోర్ట్ కూడా కొన్ని గంటపాటు కార్యకలాపాలు నిలిపివేసింది. విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఇండిగో విమానం ప్రమాదానికి గురవుతూ తృటిలో తప్పించుకుంది.

ఎయిర్ పోర్ట్ రన్‌వేపై ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో భారీ ఈదురుగాలులు ఉండడంతో విమానం చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ల్యాండింగ్ సమయంలో ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ చివరి నిమిషంలో విమానాన్ని మళ్లీ గాల్లోకి లేపాడు. ల్యాండింగ్ చేసే క్రమంలో భారీగా ఈదురు గాలులు ఉండడం వల్ల విమానం వెనుక భాగం రన్‌వేకు బలంగా తాకే ప్రమాదం పసిగట్టిన పైలట్ వెంటనే విమానాన్ని పైకి లేపాడు. గాల్లోనే కాసేపు చక్కర్లు కొట్టి.. ఆ తరువాత సురక్షితంగా రన్ వేపై ల్యాండ్ చేశాడు. చివరికి విమానంలోని ప్రయాణికులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.


భారతదేశంలోని దక్షిణది రాష్ట్రాల్లో శనివారం ఫెంగల్ తుఫాను తాకింది. దీంతో చెన్నై ఎయిర్‌పోర్ట్ అధికారులు కార్యకలాపాలు ఆదివారం ఉదయం 4 గంటల వరకు నిలపివేశారు. కానీ తుఫాను చెన్నై నగరాన్ని దాటిసేందని వాతావరణ శాఖ తెలపడంతో రాత్రి ఒంటి గంటకే తిరిగి విమానాల రాకపోకలు ప్రారంభించారు. మధ్యలో విమానాల రాకపోకలు ఆలస్యం కావడంతో చాలామంది ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లోనే నిలిచిపోవాల్సి వచ్చింది. తుఫాను కారణంగా చాలా అంతర్జాతీయ విమానాలు ఇతర నగరాలకు మళ్లించాల్సి వచ్చింది.

మరోవైపు ఫెంగల్ తుఫాను వల్ల తమినాడు, పుదుచ్చేరితో పాటు శ్రీలంకలో భారీ బిభత్సం జరిగింది. తమిళనాడులో తిరువల్లూర్ , నాగపట్టణం ప్రాంతాల్లో నుంచి 470 మంది ప్రజలను అధికారులు ఖాళీ చేయించి శరణార్థి శిబిరాలకు తరలించారు. శ్రీలంకలో ఇప్పటివరకు 15 మంది మరణించారని సమాచారం. మొత్తం 4.5 లక్షల మంది తుఫాను వల్ల నిరాశ్రయులయ్యారని స్థానిక మీడియా తెలిపింది.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×