BigTV English
Advertisement

Chhatarpur Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్తూ ఏడుగురు దుర్మరణం

Chhatarpur Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్తూ ఏడుగురు దుర్మరణం

Chhatarpur road accident seven people lost their lives: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తర్‌పూర్ జిల్లాలో ఆటో ఎదురుగా ఉన్న ట్రక్కును వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా..ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.


స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తర్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి ఆటోలో భక్తులు బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఝాన్సీ ఖజురఘో రహదారికి ఆటో చేరుకుంది. అనంతరం అధిక వేగంగా ట్రక్కను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.


మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఆటో డ్రైవర్ అతివేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

Also Read: నిమోనియా.. ఎయిమ్స్‌లో చేరిన సీపీఎం కార్యదర్శి సీతారం ఏచూరి

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ప్రేమ్ నారాయన్ కుష్వాహా తోపాటు జనార్ధన్(45), మను శ్రీవాస్తవ, నాన్హే, గోవింద్, జనార్ధన్ కుమార్తె(18)తో పాటు మరో ఒక్కరు చనిపోయారు.

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×