E-Paper
Advertisement

Chhatarpur Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్తూ ఏడుగురు దుర్మరణం

Chhatarpur Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్తూ ఏడుగురు దుర్మరణం

Chhatarpur road accident seven people lost their lives: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తర్‌పూర్ జిల్లాలో ఆటో ఎదురుగా ఉన్న ట్రక్కును వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా..ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తర్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి ఆటోలో భక్తులు బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఝాన్సీ ఖజురఘో రహదారికి ఆటో చేరుకుంది. అనంతరం అధిక వేగంగా ట్రక్కను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఆటో డ్రైవర్ అతివేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

Also Read: నిమోనియా.. ఎయిమ్స్‌లో చేరిన సీపీఎం కార్యదర్శి సీతారం ఏచూరి

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ప్రేమ్ నారాయన్ కుష్వాహా తోపాటు జనార్ధన్(45), మను శ్రీవాస్తవ, నాన్హే, గోవింద్, జనార్ధన్ కుమార్తె(18)తో పాటు మరో ఒక్కరు చనిపోయారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×