E-Paper
Advertisement

Chhatarpur Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్తూ ఏడుగురు దుర్మరణం

Chhatarpur Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్తూ ఏడుగురు దుర్మరణం
Advertisement

Chhatarpur road accident seven people lost their lives: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తర్‌పూర్ జిల్లాలో ఆటో ఎదురుగా ఉన్న ట్రక్కును వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా..ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తర్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి ఆటోలో భక్తులు బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఝాన్సీ ఖజురఘో రహదారికి ఆటో చేరుకుంది. అనంతరం అధిక వేగంగా ట్రక్కను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఆటో డ్రైవర్ అతివేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

Advertisement

Also Read: నిమోనియా.. ఎయిమ్స్‌లో చేరిన సీపీఎం కార్యదర్శి సీతారం ఏచూరి

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ప్రేమ్ నారాయన్ కుష్వాహా తోపాటు జనార్ధన్(45), మను శ్రీవాస్తవ, నాన్హే, గోవింద్, జనార్ధన్ కుమార్తె(18)తో పాటు మరో ఒక్కరు చనిపోయారు.

Related News

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×