E-Paper
Advertisement

CM Kejriwal’s first Reaction: కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్, నియంతృత్వంపై పోరాటం.. కలిసి రావాలంటూ,

CM Kejriwal’s first Reaction: కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్, నియంతృత్వంపై పోరాటం..  కలిసి రావాలంటూ,
Advertisement

CM Kejriwal’s first Reaction: దాదాపు 50 రోజుల జైలులో గడిపిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు నుంచి తొలిసారి ప్రజలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశంలోని 140 కోట్ల మంది కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

దేశాన్ని రక్షించుకునేందుకు ప్రజలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తన శక్తి మేరకు పోరాటం చేస్తానని వెల్లడించారు. తాను ఎంతగానో ఆరాధించే హనుమంతుడి ఆశీర్వాదంతో జైలు నుంచి బయటకు వచ్చానన్నారు. శనివారం ఉదయం కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటానని, తనను చూడాలంటే ప్రజలు అక్కడికి రావాలని సూచన చేశారు.

Advertisement

శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతానని వెల్లడించారు. నేరుగా ఇంటికి చేరుకున్న కేజ్రీవాల్‌కు ఇంటి వద్ద తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. శనివారం దక్షిణ ఢిల్లీలో రోడ్ షో జరగనుంది. దీనికి కేజ్రీవాల్ తోపాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హాజరుకానున్నారు.

ALSO READ: కాంగ్రెస్ పార్టీ కూడా తప్పులు చేసింది.. తప్పకుండా మార్చుకుంటాం: రాహుల్ గాంధీ

Advertisement

కేజ్రీవాల్ విడుదలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున‌ఖర్గే రియాక్ట్ అయ్యారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని, న్యాయస్థానం ద్వారా రిలీఫ్ వచ్చిందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇలాంటి తప్పు చేయరాదన్నారు. అటు బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా స్పందించారు.  కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పొందడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పరిణామం ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయానికి దోహదపడుతున్నారు.

Kejriwal takes blessing from his parents at home
Kejriwal takes blessing from his parents at home

అటు అధికార బీజేపీ పార్టీ కూడా స్పందించింది. ఇది రెగ్యులర్ బెయిల్ కాదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. ఆయన ప్రచారానికి వెళ్లిన ప్రతిసారీ మద్యం కుంభకోణం ఇష్యూ ప్రజలకు గుర్తుకు వస్తుందన్నారు.

 

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×