BigTV English
Advertisement

Vishal Patel Comments: ఎవ్వరి మాట విననన్న మాజీ సీఎం మనవడు.. చివరకు..

Vishal Patel Comments: ఎవ్వరి మాట విననన్న మాజీ సీఎం మనవడు.. చివరకు..

Vishal Patel Comments: మహారాష్ట్రలోని సాంగ్లీ లోక్ సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్ ను ఉపసంహరించుకునేలా పార్టీ నాయకుడు విశాల్ పాటిల్ ను ఒప్పించడంలో కాంగ్రెస్ విఫలమైంది. దీంతో సాంగ్లీ లోక్ సభ స్థానం నుంచి త్రిముఖ పోరు నెలకొన్నది. ఈ క్రమంలో విశాల్ ను ఎన్నికల నుంచి వైదొలగాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రయత్నించారని, అయినా కూడా అతను వినలేదని, దీంతో అతనిపై పార్టీకి సంబంధించిన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని అక్కడి కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, విశాల్ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో 1.64 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. విశాల్ సాంగ్లీ నియోజకవర్గంలో బలమైన నాయకుడు అని, ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని ఆయన మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.


Also Read:మీకు క్షమాపణలు చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను: పవార్

అయితే, శివసేన(యుబిటి) అభ్యర్థి ఇప్పటికే ప్రచారం ప్రారంభించారని, కానీ ఇప్పటివరకు స్థానిక కాంగ్రెస్ నేతలెవరూ ఆ ప్రచారంలో పాల్గొనలేదని.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్ తన వెంటే ఉందని విశాల్ పాటిల్ అంటున్నారని.. పార్టీ తనకు టికెట్ కేటాయించకపోయినా సరే తాను ప్రజల కోరిక మేరకే బరిలో నిల్చుంటున్నానని.. ఖచ్చితంగా తాను విజయం సాధిస్తానని విశాల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడని అందులో పేర్కొంటున్నారు. అయితే, సాంగ్లీ నియోకవర్గం నుంచి త్రిముఖ పోటీ నెలకొనడంతో అక్కడ ప్రస్తుతం పోటీ ఆసక్తిగా మారింది. విశాల్ పాటిల్ మహారాష్ట్ర మాజీ సీఎం వసంత్ దాదా పాటిల్ మనవడు.


Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×