E-Paper
Advertisement

Covid : పెరుగుతున్న జేఎన్.1 కేసులు.. ఒడిశాలో తొలి కేసు నమోదు..

Covid : దేశంలో కొవిడ్‌-19 సబ్ వేరియంట్ ‘జేఎన్‌.1’ కేసులు మరింతగా పెరిగాయి. దేశవ్యాప్తంగా జేఎన్.1 కేసుల సంఖ్య 197కు చేరింది. కేరళలోనే అత్యధికంగా 83 కేసులు నమోదు అయినట్టు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం ప్రకటించింది. ఒడిశాలో ‘జేఎన్‌.1’ తొలి పాజిటివ్‌ కేసు నమోదు అయింది. ఇండియాలో ఇప్పటివరకు 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

Covid : పెరుగుతున్న జేఎన్.1 కేసులు.. ఒడిశాలో తొలి కేసు నమోదు..

Covid : దేశంలో కొవిడ్‌-19 సబ్ వేరియంట్ ‘జేఎన్‌.1’ కేసులు మరింతగా పెరిగాయి. దేశవ్యాప్తంగా జేఎన్.1 కేసుల సంఖ్య 197కు చేరింది. కేరళలోనే అత్యధికంగా 83 కేసులు నమోదు అయినట్టు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం ప్రకటించింది. ఒడిశాలో ‘జేఎన్‌.1’ తొలి పాజిటివ్‌ కేసు నమోదు అయింది. ఇండియాలో ఇప్పటివరకు 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

కేరళలో అత్యధికంగా 83, గోవా (51), గుజరాత్ (34), కర్ణాటక (8), రాజస్థాన్ (5), మహారాష్ట్ర (8), తమిళనాడు (4), తెలంగాణ (2), ఒడిశా (1), ఢీల్లీ (1) కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా నవంబర్‌లో 17న సబ్‌వేరియంట్‌ కేసులను తొలిసారిగా గుర్తించారు. డిసెంబర్‌లోనే ఈ కొత్త వేరియంట్ కేసులు 180 నిర్ధారించినట్లు ‘ఇన్సాకాగ్‌’ ప్రకటించింది.

మరోవైపు లద్ధాఖ్‌లోని లేహ్‌ జిల్లాలో కేసులు పెరుగుతుండటంతో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కు‌లు తప్పనిసరిగా ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో పెరుగుతున్న కేసులు వల్ల అందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు దేశంలో 636 కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసులు సంఖ్య 4,394 కి చేరుకున్నాయి.


కొవిడ్ సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశలున్నాయని వైద్య అధికారులు ప్రకటించారు. అయితే ఈ వేరియంట్ తో ప్రమాదం తక్కువేనని వైద్యాధికారులు వెల్లడించారు. ‘జేఎన్‌.1’ సబ్ వేరియంట్ ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×