E-Paper
Advertisement

Crocodile Attacks Boy| బాలుడిని ఒక్కసారిగా నోటితో పట్టుకన్న మొసలి.. పక్కనే ఉన్న గొర్రెల కాపరి ఏం చేశాడంటే?.

Crocodile Attacks Boy| బాలుడిని ఒక్కసారిగా నోటితో పట్టుకన్న మొసలి.. పక్కనే ఉన్న గొర్రెల కాపరి ఏం చేశాడంటే?.
Advertisement

Crocodile Attacks Boy| పశువులను కాసేందుకు నదీ తీరానికి వెళ్లిన ఓ 12 ఏళ్ల బాలుడిపై పెద్ద మొసలి దాడి చేసింది. బాలుడి ఎడమ చేయిని నోటితో పట్టుకొని నదిలో లాకెళ్లింది. ఇక అతను ఆ మొసలికి ఆహారమైపోయాడనుకుంటున్న సమయంలో ఆ భగవంతుడే బాలుడి కాపాడాడు. బాలుడితో వచ్చిన అతని స్నేహితులు, ఇతర గొర్రెల కాపరులంతా కలిసి నీళ్లలో దూకి అతడిని ప్రాణాలు కాపాడారు. మొసలితో పోరాడడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటిది ఆ బాలుడి స్నేహితులు ప్రాణాలు లెక్క చేయకుండా నదిలోకి దూకి మొసలిని వెంబడించి మరీ పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్ భద్ర జిల్లా లో జరిగింది.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. సోన్ భద్ర జిల్లా.. పేఢ్ గ్రామానికి చెందిన అజిత్ అనే వ్యక్తి బర్రెలు, ఆవులున్నాయి. వాటికి గడ్డి మేపేందుకు అజిత్ కుమారుడు రమేష్ నదీతీరానికి వెళుతుంటాడు. అలా రమేష్ తన పశువులు తీసుకొని గ్రామంలోని భలువా బందీ నదీ తీరానికి వెళ్లాడు. రమేష్ తో పాటు గొర్రెలు మేపే అతని స్నేహితులు కూడా వచ్చారు.

Advertisement

Also Read: రూ.500 ఇంటి రెంటు..దుర్భర జీవితం.. కలలు సాకారం చేసేందుకు జొమాటో బాయ్ పోరాటం

అయితే ఆ పశువులలో ఒకటి గడ్డిమేస్తూ.. నది సమీపానికి వెళ్లిపోయింది. ఆ పశువును తిరిగి తీసుకువచ్చేందుకు వెళ్లిన రమేష్.. ఆ పక్కనే బుడదలో ఉన్న మొసలిని గమనించలేదు. తన పశువుని వెనక్కి తోలుకుంటూ పోతున్న సమయంలో ఒక్కసారిగా వెనుక నుంచి ఆ మొసలి రమేష్ కాలిని నోటితో గట్టిగా పట్టుకుంది. కానీ రమేష్ తన చేతిలో ఉన్న కర్రతో దాని తలపై కొట్టగా.. అది రమేష్ కాలిని వదిలేసి అతడి ఎడమ చేయిని గట్టిగా పట్టుకుంది. దీంతో రమేష్ తన స్నేహితులకు సాయం చేయమని కేకలు వేశాడు.

Advertisement

రమేష్ కేకలు విన్న అతని స్నేహితులు వెంటనే అక్కడికి వచ్చి మొసలి చూసి షాకయ్యారు. అయినా భయపడకుండా మొసలిని కర్రలతో బాదుతుండగా.. రమేష్ ని ఆ మొసలి నీళ్లలో పది అడుగుల దూరం వరకు తీసుకెళ్లింది. అయినా భయపడుకుండా రమేష్ స్నేహితులు, ఇతర గ్రామస్తులు మొసలిని వెంబడించి పట్టుకున్నారు. మొసలి నోట్లో ఒక ప్లాస్టిక్ పైపు నిలువుగా పెట్టి రమేష్ ని మొసలి నోటి నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నించారు. కానీ మొసలి వదల్లేదు. దీంతో వారంతా కర్రలతో రాళ్లతో మొసలిని కొట్టారు. చివరికి మొసలి రమేష్ ని వదిలిపెట్టి నీళ్లలోకి పారిపోయింది.

ఈ ఘటనలో రమేష్ చేతి ఎముకలు విరిగిపోయాయి. అతని కాలు, తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. రమేష్ వెంటనే గ్రామంలోని డాక్టర్ వద్దకు తీసుకువెళ్తే.. చేతికి ఆపరేషన్ చేయాలని సూచిస్తూ.. గ్రామ డాక్టర్లు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. రమేష్‌ని అతని కుటుంబ సభ్యులు.. సోన భద్ర జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రమేష్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Also Read:  యూట్యూబర్ ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు.. పరువు నష్టం దావా వేసిన బిజేపీ నాయకుడు

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×