BigTV English
Advertisement

Cyclone : సాయంత్రం తీరం దాటనున్న తుపాన్.. గుజరాత్ కు ముప్పు.. 8 రాష్ట్రాల్లో వర్షాలు..

Cyclone : సాయంత్రం  తీరం దాటనున్న తుపాన్.. గుజరాత్ కు ముప్పు.. 8 రాష్ట్రాల్లో వర్షాలు..


Cyclone : బిపోర్‌ జాయ్‌ తుపాన్ గురువారం తీరాన్ని దాటనుంది. దీని ప్రభావంతో గుజరాత్‌లో భారీ వర్షాలు కురవడంతోపాటు అతి బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుపాన్ బుధవారం గుజరాత్‌లోని కచ్‌, దక్షిణ పాకిస్థాన్‌ వైపు దిశను మార్చుకుంది. జఖౌ వద్ద తీరాన్ని దాటనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్ గమనం మందగించిందని ప్రకటించారు.

తుపాన్ సౌరాష్ట్ర, కచ్‌లను తాకుతుంది. అలాగే మాండవి, కరాచీల మధ్య జఖౌ సమీపంలో తీరాన్ని దాటనుంది. తుపాన్ స్వల్పంగా బలహీనపడిందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. అయినా సరే గుజరాత్‌కు ముప్పు పొంచే ఉందని హెచ్చరించారు. తుపాన్ తీరాన్ని దాటే సమయంలో 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. సౌరాష్ట్ర, కచ్‌లలో కెరటాలు 2 నుంచి 3 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడతాయని పేర్కొన్నారు.


తుపాన్ ముప్పుతో గుజరాత్‌ తీర ప్రాంతాల్లోని సుమారు 50 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దేవభూమి ద్వారక, జాంనగర్‌, జునాగఢ్‌, పోర్‌బందర్‌, రాజ్‌కోట్‌ జిల్లాల్లోని తొమ్మిది తాలూకాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ త్రివిధ దళాధిపతులతో చర్చించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

తీర ప్రాంత జిల్లాల్లో సహాయక చర్యలకు సర్వం సిద్ధం చేశారు. ఇందుకోసం 18 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. మహారాష్ట్రలో 14 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అధికారులు మోహరించారు. ముంబైలో 5 బృందాలను సిద్ధం చేశారు.

బిపోర్‌ జాయ్‌ తుపాన్ ప్రభావంతో గుజరాత్‌తోపాటు మరో 8 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాలతోపాటు దమణ్‌ దీవ్‌, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.

Tags

Related News

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Big Stories

×