E-Paper
Advertisement

Bihar Bank Robbery | బిహార్ బ్యాంక్ దోపిడీ.. పోలీసులకు ఝలక్ ఇచ్చిన దొంగలు!

Bihar Bank Robbery | సాధారణంగా బ్యాంకులో దోపిడి జరిగే ఘటనలను ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. బ్యాంకులోకి మారణాయుధాలతో దొంగలు ప్రవేశించడం.. లోపల ఉన్న సిబ్బందిని, ప్రజలను బెదిరించడం.. డబ్బు ఎత్తుకెళ్లడం జరిగిపోతుంటాయి. ఆ తరువాత కొన్ని సందర్భాలలో పోలీసులు చాకచక్యంగా దొంగలని పట్టుకొని అరెస్ట్ చేయడం వంటివి జరుగుతుంటాయి.

Bihar Bank Robbery | బిహార్ బ్యాంక్ దోపిడీ.. పోలీసులకు ఝలక్ ఇచ్చిన దొంగలు!
Advertisement

Bihar Bank Robbery | సాధారణంగా బ్యాంకులో దోపిడి జరిగే ఘటనలను ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. బ్యాంకులోకి మారణాయుధాలతో దొంగలు ప్రవేశించడం.. లోపల ఉన్న సిబ్బందిని, ప్రజలను బెదిరించడం.. డబ్బు ఎత్తుకెళ్లడం జరిగిపోతుంటాయి. ఆ తరువాత కొన్ని సందర్భాలలో పోలీసులు చాకచక్యంగా దొంగలని పట్టుకొని అరెస్ట్ చేయడం వంటివి జరుగుతుంటాయి. ఈ తరహా ఘటన ఇప్పుడు బీహార్ లోని అర్రాలో జరిగింది. అయితే చివర్లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు దొంగలు.

అర్రాలోని సర్క్యూట్ హౌస్ రోడ్‌లో గల యాక్సిస్ బ్యాంక్ లోకి ఈరోజు ఉదయాన్నే పది గంటల సమయంలో ఐదుగురు దుండగులు ఆయుధాలతో ప్రవేశించారు. ఆ తర్వాత ఆయుధాలతో సిబ్బందిని భయపెడుతూ అందర్నీ ఒక గదిలో బంధించారు. ఇక ప్లాన్ ప్రకారం… బ్యాంకు కౌంటర్లో ఉంచిన 16 లక్షల నగదును తీసుకుని కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే అక్కడి నుంచి ఉడాయించారు.

Advertisement

అయితే బ్యాంకు సిబ్బంది మాత్రం దొంగలు ఇంకా బ్యాంకులోనే ఉన్నారని భావించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు….బయటి నుంచి బ్యాంకును చుట్టుముట్టారు. ఫైరింగ్ జరిగే అవకాశం ఉందనే అనుమానంతో ప్రజలను అక్కడి నుంచి తరలించి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, గన్ లతో రెడీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు దొంగలను లొంగిపోవాలని.. లేదంటే కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. కానీ వారి నుంచి ఎటువంటి కదలిక లేకపోవడంతో చాకచక్యంగా లోపలికి ప్రవేశించిన పోలీసులు…..ఉద్యోగులను సురక్షితంగా బయటికి తీసుకు వచ్చారు. కానీ అప్పటికే దొంగలు తప్పించుకున్నారని.. గుర్తించిన పోలీసులు.. సిబ్బంది సమాచారంతో పొరబడినట్లు గుర్తించారు.

పోలీసులు బ్యాంకు బయట గంటన్నర పాటు వేచి ఉన్న సమయాన్ని దొంగలు సద్వినియోగం చేసుకుని పారిపోయినట్లు వెల్లడించారు. దోపిడీ సమయంలో సిబ్బందికి ఎటువంటి హాని జరగలేదని.. బ్యాంక్ లాకర్ కూడా భద్రంగా ఉందని భోజ్ పూర్ ఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. నేరస్థుల ఫోటోలు, వీడియోలు లభించాయని.. వారిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. బయటకు వెళ్లే సమయంలో అగంతకులు బ్యాంకు ప్రధాన గేటు సీసీ కెమెరాను పగులగొట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×