E-Paper
Advertisement

Chandigarh Mayoral Poll: సుప్రీం సంచలన తీర్పు.. చండీగఢ్‌ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి విజేతగా ప్రకటన

Chandigarh Mayoral Poll: సుప్రీం సంచలన తీర్పు.. చండీగఢ్‌ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి విజేతగా ప్రకటన
Advertisement
Chandigarh Mayoral Poll

Aap won the Chandigarh Mayoral Poll: చంఢీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆప్ అభ్యర్థి కుల్ దీప్ కుమార్ ను విజేతగా ప్రకటించింది. సర్వోన్నత న్యాయస్థానంలో కౌంటింగ్ నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు ఆప్ ఆనందం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పుతో బీజేపీ కుటిల ప్రయత్నం బయటపడిందని పేర్కొంది. ఒక మేయర్ పదవి కోసం కేంద్రం, బీజేపీ వ్యవహరించిన తీరుపై మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు కాపాడిందంటూ ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Advertisement

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై వివాదం నడుస్తోంది. ఎన్నికపై అక్రమాలు జరిగాయని ఆప్ ఆరోపించింది. ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం ఆ రోజు నిర్వహించిన మేయర్ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి తీరును తప్పుపట్టింది. బ్యాలెట్ పత్రాలను తారుమారు ఘటనను ప్రస్తావించింది.

Read More: రాజ్యసభకు సోనియా గాంధీ, జేపీ నడ్డా.. ఏకగ్రీవంగా ఎన్నిక..

Advertisement

ఉద్దేశపూర్వంగానే రిటర్నింగ్ అధికారి అలా చేశారనేది స్పష్టంగా తెలుస్తోందని సుప్రీంకోర్టు తేల్చేసింది. రిటర్నింగ్ అధికారి కొట్టివేత గుర్తు పెట్టిన బ్యాలెట్ పేపర్లను సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. మేయర్ ఎన్నిక సమయంలో చేపట్టిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ వీడియోను న్యాయమూర్తులు వీక్షించారు. చివరికి ఎన్నికలో అక్రమాలు జరిగియాని సుప్రీంకోర్టు నిర్ధారించింది.

జనవరి 30న చండీగఢ్ మేయర్ ఎన్నిక జరిగింది. మేయర్ ఎన్నికలో విజయం సాధించాలంటే 20 మంది కౌన్సిలర్ల మద్దతు కావాలి. కానీ బీజేపీ 16 మంది సభ్యులే ఉన్నారు. అయినప్పటీ ఆ పార్టీ అభ్యర్థి మనోజ్ సోంకర్ ను విజేతగా ఎన్నికల రిట్నరింగ్ అధికారి ప్రకటించారు. ఆప్‌-కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి కుల్ దీప్ కుమార్‌ ఓడిపోయినట్లు వెల్లడించారు.

మేయర్ ఎన్నికల్లో పట్టపగలే మోసం జరిగిందని ఆరోపిస్తూ ఆప్‌ కౌన్సిలర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న న్యాయస్థానం అన్ని అంశాలను పరిశీలించి చివరికి ఆప్ అభ్యర్థి కుల్ దీప్ కుమార్ ను చంఢీగఢ్ మేయర్ గా ప్రకటించింది.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×