E-Paper
Advertisement

Lok Sabha Elections 2024: రేపు ఏ ఏ రాష్ట్రాలల్లో ఎన్నికలు జరగనున్నాయి? ఎంతమంది పోటీ చేస్తున్నారంటే?

Lok Sabha Elections 2024: రేపు ఏ ఏ రాష్ట్రాలల్లో ఎన్నికలు జరగనున్నాయి? ఎంతమంది పోటీ చేస్తున్నారంటే?

Lok Sabha Elections 2024 Phase 4: నాలుగో దశ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. అయితే, రేపు ఉదయం ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. నాలుగో దశలో భాగంగా మొత్తం 96 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 10 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 1,717 మంది పోటీ చేస్తున్నారు. అయితే, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నారు. అత్యలంగా ఒడిశాలోని నవరంగ్ పుర్ నియోజకవర్గం నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ఈ దఫాలో పలువురు ముఖ్యనేతలు బరిలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో ఉన్నారు. ఈయన యూపీలోని కన్నోజ్ నుంచి పోటీ చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోని బేగుసరాయ్ నుంచి కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఉజియార్ పూర్ నుంచి మరో కేంద్రమంత్రి నిత్యానందరాయ్ బరిలో ఉన్నారు. బెంగాల్ లోని బహరాంపుర్ నుంచి ప్రముఖ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరీ పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని బీడ్ స్థానం నుంచి బీజేపీ నాయకురాలు పంకజా ముండే పోటీ చేస్తున్నారు. వీరితోపాటు పలువురు కూడా పోటీ చేస్తున్నారు.

Also Read: Lok Sabha Elections 2024: నాలుగో దశ పోలింగ్‌కు రంగం సిద్ధం.. 96 ఎంపీ స్థానాల బరిలో 1,717 మంది

తెలుగు రాష్ట్రాల్లో ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు రేపు పోలింగ్ జరగనున్నది. అదేవిధంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరగనున్నది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్నది. ఇక్కడ ఈసారి పలువురు కీలక నేతలు పోటీ చేస్తున్నారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×