Doordarshan TV Anchor Faints in LIVE While Reading Weather Updates in West Bengal: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్టోగ్రతలు పెరుగుతున్నాయి. రోడ్డు మీద కాలి పెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా వడగాల్పులతో ఇంట్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.
అసలు విషయానికొద్దాం.. దూరదర్శన్లో వాతావరణానికి సంబంధించి వార్తలు చదువుతున్న సమయంలో మహిళా న్యూస్ యాంకర్ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే సిబ్బంది రియాక్టు కావడంతో ఆమెకు ప్రాణాప్రాయం తప్పింది. స్టూడియోలో న్యూస్ చదువుతుండగా ఆమె సొమ్మసిల్లి పడిపోవడం వెనుక కారణమేంటి?
స్టోరీ లోతుల్లోకి వెళ్తే.. బెంగాల్ దూరదర్శన్ న్యూస్ యాంకర్ పేరు లోపాముద్ర సిన్హా. వాతావరణం గురించి వార్త చదువుతుండగా ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయారు. వెంటనే సిబ్బంది స్పందించడంతో ఆమెకు ప్రాణాప్రాయం తప్పింది. వార్తలు చదువుతున్న సమయంలో బీపీ తగ్గడంతో పడిపోయినట్టు తెలిపారు. తన పరిస్థితి గురించి తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు యాంకర్ లోపాముద్ర.
Also Read: కేజ్రీవాల్ను చంపడానికి బీజేపీ కుట్ర.. తినే ఆహారాన్ని కూడా వదలడం లేదు: సునీతా కేజ్రీవాల్
న్యూస్ ప్రారంభానికి ముందు తనకు అసౌకర్యంగా అనిపించిందని తెలిపారు లోపాముద్ర. కాస్త కుదుటపడిన తర్వాత ప్రసారాలు మొదలయ్యాయి. అయితే వార్తలు చదువుతున్న సమయంలో చాలా సేపు వాటర్ తీసుకోలేదు. ఆ క్రమంలో నా కళ్లలో చీకట్లు అలముకున్నాయిని, వెంటనే ఆకస్మికంగా పడిపోయాయనని వివరించారు. మొత్తానికి ఆమె ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డారు.