E-Paper
Advertisement

DRDO : ఆకాశ్‌.. అదరహో.. ఒకేసారి నాలుగు టార్గెట్లను కూల్చేసిన డీఆర్‌డీఓ..

DRDO : ఆకాశ్‌.. అదరహో.. ఒకేసారి నాలుగు టార్గెట్లను కూల్చేసిన డీఆర్‌డీఓ..

DRDO : ఒకేసారి ఒకటికి మించిన టార్గెట్లు దూసుకొస్తే భారత రక్షణ దళాలు ఎలా ఎదర్కొంటాయి? వివిధ దిశల్లో మన స్థావరాలపై దూసుకొచ్చే యుద్ధ విమానాలు, ఇతర UAVలను అడ్డుకోవడం ఎలా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పింది డిఫెన్స్‌ రిసెర్స్‌ అండ్ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్. సొల్యూష్‌ కనిపెట్టడమే కాదు.. దాన్ని ఆచరణలో చేసి చూపించింది.

భారత గగన విధుల రక్షణలో ముందు వరుసలో ఉన్న ఆకాశ్‌ మిస్సైల్స్‌ను ఉపయోగించి ఒకేసారి నాలుగు టార్గెట్లను విజయవంతంగా కూల్చేసింది DRDO. ఇలాంటి ఫీట్‌ సాధించిన తొలి దేశంగా భారత్‌ ఇప్పుడు నిలిచింది.

ఏపీలోని సూర్యలంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో నిర్వహించిన ఆస్త్రశక్తి 2023 ఎక్సర్‌సైజ్‌ల్లో భాగంగా ఈ పరీక్షను నిర్వహించారు. 25 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చిన నాలుగు టార్గెట్లను సింగిల్ ఫైరింగ్ యూనిట్‌తో కూల్చేసింది. ఈ ఆకాశ్‌ ఫైరింగ్ యూనిట్‌లో ఒక ఫైరింగ్ లెవల్ రాడార్‌.. ఫైరింగ్ కంట్రోల్ సెంటర్, రెండు ఆకాష్‌ ఎయిర్‌ఫోర్స్‌ లాంచర్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో లాంచర్‌లో ఐదు ఆర్మ్‌డ్‌ మిసైల్స్ ఉంటాయి.

FLR పరిధిలోకి వచ్చిన టార్గెట్‌ను వెంటనే అలర్ట్ చేయగానే.. ఫైరింగ్‌ యూనిట్‌ వాటిని కూల్చేసింది. క్షణాల వ్యవధిలో నాలుగు టార్గెట్‌లను ఫైర్‌ చేసి కూల్చేసింది. వేరు వేరు దిశల నుంచి వచ్చే టార్గెట్లను గుర్తించి ఖచ్చితత్వంతో కూల్చేశాయి. ఈ ప్రయోగం సక్సెస్‌ అయినట్టు DRDO ప్రకటించింది.

గత పదేళ్లుగా భారత రక్షణశాఖ ఆకాశ్‌ మిసైల్స్‌ను ఉపయోగించింది. ఇవి సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్స్‌. ఇప్పటి వరకు అనేక సార్లు వీటిని విజయవంతంగా పరీక్షించారు.

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×