BigTV English

Election Commission: దీదీ, కంగనాపై అనుచిత వ్యాఖ్యలు.. దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్‌లకు ఈసీ వార్నింగ్..

Election Commission: దీదీ, కంగనాపై అనుచిత వ్యాఖ్యలు.. దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్‌లకు ఈసీ వార్నింగ్..
Election Commission Warns Dilip Ghosh, Supriya Srinate
Election Commission Warns Dilip Ghosh, Supriya Srinate

Election Commission Warns Dilip Ghosh, Supriya Shrinate: మహిళల గౌరవాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ నేత దిలీప్ ఘోష్, కాంగ్రెస్‌కు చెందిన సుప్రియా శ్రీనేత్‌లపై ఎన్నికల సంఘం సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.


వారు తక్కువ స్థాయి వ్యక్తిగత దాడికి పాల్పడ్డారని, తద్వారా మోడల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలను ఉల్లంఘించారని తాము నమ్ముతున్నామని కమిషన్ పేర్కొంది.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కాలంలో బహిరంగంగా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వీరిరువురి ఎన్నికలకు సంబంధించిన కమ్యూనికేషన్లను సోమవారం నుంచి కమిషన్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది.


పబ్లిక్ డొమైన్‌లో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈసీ తెలిపింది. అలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయకుండా, మోడల్ కోడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించకుండా ఉండేందుకు తమ కార్యకర్తలకు అవగాహన కల్పించడం కోసం హెచ్చరిక నోటీసు కాపీ సంబంధిత పార్టీల చీఫ్‌లకు పంపిస్తామని ఈసీ పేర్కొంది.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో శ్రీనేత్ ఖాతాల నుంచి వివాదాస్పద వ్యాఖ్య పోస్ట్ అయ్యింది. ఆ తరువాత శ్రీనేత్ తన అన్ని సామాజిక ఖాతాల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలను తీసివేసారు. అవి తాను పోస్ట్ చేసినవి కావు కానీ తన ఖాతాలకు యాక్సెస్ ఉన్న వేరొకరు పోస్ట్ చేసారని పేర్కొన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని హేళన చేస్తూ బీజేపీ నేత దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.

Also Read: EC Issue Show Cause Notices: దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనాట్‌లకు ఈసీ షాక్.. షోకాజ్ నోటీసులు జారీ..

శ్రీనేత్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఈసీని ఆశ్రయించగా, టీఎంసీ ఘోష్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ప్యానెల్‌ను ఆశ్రయించింది.

భారతీయ సమాజంలో మహిళలకు గతంలో, ప్రస్తుతం అత్యున్నత గౌరవం ఉందని ఈసీ స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంతో పాటు దేశంలోని అన్ని సంస్థలు అన్ని రంగాలలో మహిళల హక్కులు, వారి గౌరవాన్ని నిర్ధారించే ఆలోచనలను నిరంతరం కొనసాగిస్తున్నాయని, వారిని మరింత శక్తివంతం చేస్తుందని పోల్ అథారిటీ ఘోష్, శ్రీనేత్‌‌లకు హెచ్చరికలు జారీ చేసింది.

ఎన్నికల ప్రక్రియలో మహిళా ప్రాతినిధ్యం, భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో తాము నిమగ్నమై ఉన్నామని పోల్ అథారిటీ తెలిపింది. ఎన్నికల నమోదు, ఓటింగ్ శాతంలో లింగ అంతరం చాలా మెరుగుపడిందని, వాస్తవానికి మహిళలు ముందుకు సాగారని పేర్కొంది.

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×