E-Paper
Advertisement

Delhi Farmers Demands: ఢిల్లీలో రైతన్నలు లేవనెత్తిన డిమాండ్లు ఇవే..!

Delhi Farmers Demands: ఢిల్లీలో రైతన్నలు లేవనెత్తిన డిమాండ్లు ఇవే..!
Advertisement

Farmers are demanding to solve their problems: రెండేళ్ల కిందట దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతంలో గొప్ప ఉద్యమాన్ని తలపెట్టిన రైతులు.. ప్రస్తుతం మరోసారి తమ డిమాండ్లతో రోడ్డెక్కారు. గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ గొంతు విప్పిన రైతన్నల ధాటికి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాల విషయంలో వెనకడుగు వేసింది.

అయితే.. అనాదిగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కోరుతున్న కొత్త డిమాండ్లతో ఢిల్లీ చేరుకున్నారు. ఈ మేరకు యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఫిబ్రవరి 13న ‘దిల్లీ మార్చ్’కి పిలుపునివ్వటమే గాక ఫిబ్రవరి 16న ఒకరోజు గ్రామీణ భారత్ బంద్‌కు యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.

Advertisement

దీంతో కేంద్రం రైతు సంఘాలతో నేడు జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవటంతో రైతులు తమ సంఘర్షణను తీవ్రతరం చేయనున్నారు. ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే భయంతో కేంద్రం ఎక్కడికక్కడ రైతులు ఢిల్లీకి రాకుండా చర్యలు తీసుకోవటమే గాక.. ఇప్పటికే ఢిల్లీ శివారుకు చేరిన రైతులను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకూ ఢిల్లీలో ధర్నాలకు దిగిన రైతన్నలు కోరుతున్న డిమాండ్లేమిటో ఓసారి తెలుసుకుందాం.

Read More: నిరసనతో అట్టుడుకుతున్న దేశ రాజధాని.. తగ్గేదే లేదంటున్న రైతులు

Advertisement

ప్రధాన డిమాండ్లు..
అభివృద్ధి పేరుతో రైతులు భూములు సేకరిస్తే.. వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. ప్రస్తుతమున్న దానికంటే.. నాలుగు రెట్ల పరిహారం చెల్లించాలి.

వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి.. 200 రోజులకు పని దినాలను పెంచాలి, రోజువారీ కూలి రూ. 700 ఇవ్వాలి.

ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఘటనకు కారణమైన వ్యక్తులను శిక్షించాలి. అలాగే నాటి ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలి.

గతంలో ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసు మేరకు అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తూ చట్టం చేయాలి.

దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అన్ని పంటరుణాలను వెంటనే పూర్తిగా మాఫీ చేయాలి.

మిరప, పసుపు వంటి పలు రకాల సుగంధ పంటలకు సంబంధించి వెంటనే జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి.

రెండేళ్ల నాడు ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలి.

WTOతో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై నిషేధం విధించాలి.

విద్యుత్ పంపిణీని ప్రైవేటు సంస్థలక అప్పగించేలా అవకాశం కల్పిస్తున్న విద్యుత్ సవరణ బిల్లు 2020ను ఉపసంహరించుకోవాలి.

దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు, రైతు కూలీలకు నిర్ణీత పింఛనును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి.

నకిలీ విత్తనాలు, పురుగు మందుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసుల హక్కులను, అటవీ భూములను రక్షించేందుకు కేంద్రం పూనుకోవాలి.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×